సచివాలయం కూల్చివేత గొడవ… కేసీఆర్ నుండి సమాధానం లేదు.
కరోనా విపరీత విజృంభణ… కేసీఆర్ నుండి సమాధానం లేదు.
తనకు కరోనా అంటూ ఆరోపణలు… కేసీఆర్ కుటుంబం నుండి కూడా సమాధానం లేదు.
ఏమో…! కేసీఆర్ కి కరోనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేమి కేసీఆర్ కి విరోధి కాదుగా ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి. వెళ్తే వెళ్తుంది. ఆ టాపిక్ అసలు ముఖ్యమే కాదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే కేటీఆర్ ఏమయ్యారు అనేదే. తండ్రి కేసీఆర్ లేరు సరే., కనీసం కేటీఆర్ అయినా బయటకు వచ్చి సమాధానాలు ఇవ్వాలిగా…! ఇక్కడే ఓ కీలక పాయింటు చర్చకు వస్తుంది. అదే తెలంగాణాలో పీఠం మారుతుంది అనే టాపిక్.
ఎందుకంటే ఈ చర్చ…!
ఇప్పుడు అర్జంటుగా సచివాలయం కూల్చేసి.. కొత్తది కట్టేయాల్సిన అవసరం ఏముంది..? కరోనా కోరలు చాచిన వేళలో అంత అర్జెంటు ఏమొచ్చింది..? పాత సచివాలయం వాస్తు బాలేదు కాబట్టి కొత్తది కట్టాలి…! మరి గడిచిన ఆరున్నరేళ్లుగా కేసీఆర్ అక్కడి నుండే పాలించారు కదా..! ఇప్పుడే ఎందుకు అత్యవసరంగా మార్చేయాలి…? ఎందుకంటే పీఠం మార్చే ఉద్దేశం ఉంది కాబట్టి అనేది సమాధానం. కుమారుడు కేటీఆర్ జాతకానికి పాతది అనువైనది కాదు కాబట్టి సమాధానం.
* సరే సచివాలయం సంగతి పక్కన పెడదాం..! కేసీఆర్ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. ఒకవేళ కరోనా సోకితే ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు రీత్యా ఇప్పుడు కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ కొద్ది రోజుల్లోనే బయటకు వస్తారు. అందరికీ సమాధానం చెప్తారు. కానీ ఆయన రెండోసారి మైఖ్యమంత్రి అయినా తర్వాతనే ఓ సందర్భంలో చెప్పారు… తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది అని…! అందుకే ఇక ఆయన కరోనాని సాకుగా చూపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే వీలుంది అంటున్నారు. ఇదే సమయంలో తాను తప్పుకుని, కేటీఆర్ కి కుర్చీ ఇచ్చేనందుకు ఆయన సిద్ధమేనని తెరాస వర్గాల్లోనే చర్చ ఉంది. దీనికి పెద్దగా ఎవరికీ వ్యతిరేకత ఉండబోదు.
* తాజాగా ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇలాగే ఉన్నాయి. “కొడుకుకి కుర్చీ ఇవ్వడానికి కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. సచివాలయం అందుకే అంట తొందరగా కూల్చేసి, కట్టేస్తున్నారు. అందుకే వాస్తు ఇబ్బదులు లేకుండా చూసుకుంటున్నారు” అంటూ విరుచుకుపడ్డారు.
* తెలంగాణాలో పరిస్థితులు చేయి దాటాక ముందే కేటీఆర్ బాధ్యతలు చేపట్టి చక్కదిద్దాలని టీఆరెస్ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. నిజానికి కరోనా ఒక సీఎం ఆపితేనో, ఒక నాయకుడు ఆపితేనో ఆగేది కాదు. కాకపోతే ఒక సమీక్ష, ఒక సూచనా, ఒక దిక్సూచి ఉండాలి. అది కేటీఆర్ రూపంలో ఉండాలి అనేది ఆ పార్టీలో కొందరు కోరుతున్నారు.
* సో… ఇటు కరోనా సాకు, అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడానికి, ఇటు కేసీఆర్ ఆరోగ్య రీత్యా.., ఇటు సచివాలయ నిర్మాణ గొడవ.. మరోవైపు పార్టీలో అంతర్గత చర్చ ఇవన్నీ పరిశీలిస్తే తెలంగాణాలో సీఎం పీఠం మారే వీలుందని అంటున్నారు.