మొత్తానికి కి ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్న సందిగ్ధత కు తెరపడింది. కలిసి సమన్వయంతో ముందుకు సాగాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. రాజ్యాంగంలో అతి కీలకమైన ఎన్నికల నిర్వహణ విషయంలో పరస్పర సహకారం ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మొత్తానికి స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు రంగంలోకి దిగాల్సి అవసరం అటు ప్రభుత్వానికి… ఇటు ఉద్యోగులకు ఉంది.
విమర్శల్లో అసలు అర్థం ఉండక్కర్లేదా?
ఇకపోతే తాజాగా ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఒక విమర్శ ఈ క్రమంలో చర్చకు వచ్చిం.ది స్థానిక ఎన్నికలు అంటే వైసీపీ పార్టీ భయపడి పారిపోతుంది అని అన్నారు. పద్నాలుగేళ్ళు అధికారంలోకి ఉన్న చంద్రబాబుకి ప్రజానాడి గురించి తెలియనిది కాదు. రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో అతనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన కావాలని అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అదికార పార్టీనే ఫేవరెట్స్…
ప్రస్తుతం రాజకీయంగా ప్రజల నాడి ప్రభుత్వాలపై ఉంటుంది. ఎప్పుడూ స్థానిక ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇక ఎన్నికల్లో ఓటమి వల్లే ప్రభుత్వం భయపడుతుందని వస్తున్న విమర్శలకు అర్థం లేదు అని వారు చెబుతున్నారు. ప్రభుత్వంపై గ్రామ స్థాయిలోనే సానుభూతి ఎక్కువగా ఉందన్న వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో మనం చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని పైచేయి సాధిస్తూ వచ్చింది.
ఇగో తప్ప ఇంకేం లేనట్లే….
ఇక చంద్రబాబు మాత్రం కేవలం రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు అన్నది వారి అభిప్రాయం. పైగా అధికారంలో ఉన్న వారిని గెలిపించుకుంటే ఇంకా తమకు అభివృద్ధి తొందరగా జరుగుతుంది అన్న ఆలోచనతో కూడా ప్రజలు కచ్చితంగా ఉండి అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టు స్థానిక ఎన్నికల విషయంలో ఇంత గందరగోళం జరగడానికి ఇగో ప్రాబ్లం ఉండవచ్చు కానీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మరో ఉద్దేశం లేదు అన్నది మాత్రం స్పష్టం.