Tolly wood : ముగ్గురు స్నేహితుల కలయిక గా వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ తన భవిష్యత్తు Tolly wood టాలీవుడ్ ప్రాజెక్టులను పెద్ద హీరోలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు టాలీవుడ్లోని అందరూ పెద్ద హీరోలతోనూ వారు సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే కథలను ఎంపిక చేసుకొని, కొన్ని నిర్మాణాలను మొదలు పెట్టింది. ఇక భవిష్యత్తులోనూ వరుసగా సినిమాలు చేసేందుకు, పెద్ద హీరోల డేట్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది.
Tolly wood పాన్ ఇండియా సినిమాలు సైతం!
టాలీవుడ్ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. దానిని కొనసాగింపుగా నిర్మాతలు సైతం భారీ వ్యయంతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతలకు ముచ్చెమటలు పట్టేలా తెలుగు నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమా హీరోలు సైతం చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా కు సంబంధించిన సినిమాలు చేస్తూ భారత దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో తెలుగు నిర్మాతలు వారి మీద ఖర్చు పెట్టేందుకు ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలుగు సినిమాల మీద ఖర్చు పెట్టబోయేది సుమారు 1500 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి వారు ఓ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోపం రాకుండా ముందుగానే అందరి హీరోల కాల్షీట్లు దగ్గరనుంచి దానిలో నటించే తారాగణం వరకు అందరి ని ముందుగానే బుక్ చేసుకొని ఇక వరుస సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
అందరూ.. అందరితో!
మంచి కథలు వస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. కొత్త డైరెక్టర్లకు అవకాశాన్ని కల్పిస్తూ మంచి కథ వస్తే దానిని అందిపుచ్చుకొని సరైన హీరోను ఎంచుకుని ప్రాజెక్టు పట్టాలు ఎక్కించడానికి రెడీ అవుతున్నారు.
** మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. దీనిని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. దీని మీద సుమారు 150 కోట్ల పెట్టుబడులు జరిగినట్లు సమాచారం.
** సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమా సైతం చివరి దశకు వచ్చింది. దీనిని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఖర్చుకు వెనకాడకుండా వంద కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
** నాని హీరోగా వస్తున్న అంటే సుందరానికి సినిమా సైతం మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్నదే. చూడడానికి వినడానికి చాలా సింపుల్ సినిమాల అనిపిస్తున్న దీనికి కూడా యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
** త్వరలో మొదలు కాబోతున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కీలకమైన చెట్లు వేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా 150 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు గబ్బర్సింగ్ కాంబినేషన్ కావడంతో ఇది ఇంకా మంచి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
** ఈ సినిమాలే కాకుండా చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా, బాలకృష్ణ గోపీచంద్ మలినేని చిత్రం, విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబినేషన్, ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా ఇలా మరో ఐదు క్రేజీ భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టబోతున్నారు. అటు ఇటుగా ఈ సంవత్సరం లోనే ఎక్కువ సినిమాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టులన్నీ 2022 చివరి నాటికి పూర్తయి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.