ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరిలో ఉత్కంఠ రేపుతున్నది టీవీ 5 మూర్తి అరెస్ట్ కాబోతున్నాడు అన్న వార్త. తెలుగుదేశం పార్టీకి పరోక్ష కార్యకర్తగా మూర్తి వ్యవహరిస్తున్నాడని ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. అదీ కాకుండా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పై అనేక అనేక ఆరోపణలు మరియు అబద్ధపు ప్రచారాలు ఉద్దేశపూర్వకంగానే అతని హయాంలో జరుగుతున్నాయని చాలా మంది అధికార పార్టీ మద్దతుదారులు మాట.
వాటిలో భాగంగా మూర్తి మూడు తప్పులు చేశాడు అని అంటారు. సుధాకర్ అనే ఒక డాక్టర్ చేసిన అబద్ధపు ఆరోపణలను నెత్తినెట్టుకొని పదే పదే ప్రసారం చేయడం… పాత వీడియో ని పట్టుకొని సచివాలయం ఉద్యోగుల చిందులు అని తప్పుడు వార్తలను ప్రసారం చేయడం… మరియు కరోనా లెక్కలలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లెక్కలు చూపిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేయడం.
దీనితో జగన్ ప్రభుత్వం అతని పై మూడు కేసులు పెట్టిందని ఎవరు ధృవీకరించని వార్తలను ప్రసారం చేస్తున్నారని మరియు ఎపిడమిక్ యాక్ట్ కింద అతనిని బుక్ చేస్తే కూడా అటువంటి పెద్ద కేసులో ఇరుక్కుంటాడు అని వార్తలు బయటకు వచ్చేశాయి.. అయితే జగన్ ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా అంటే అనుమానమే. చంద్రబాబు పాలన జరుగుతున్నప్పుడు ఇటువంటివి ఎన్నో ఎల్లో మీడియా నుండి వారు సమర్థవంతంగా ఎదుర్కొని చివరికి అధికారం సాధించారు. అదే టైంలో సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఇదే పనిని చేసి ఉంటే వీరు ఎలా స్పందించే వారు?
ఏదైనా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి తప్ప మూర్తిని ఒక గడ్డి పరకల తీసేసి అతనిని అరెస్టు చేయించడం చేస్తే అతనిని అనవసరంగా హీరో చేసిన వారు అవుతారు. అతను చేసిన అబద్ధపు ఆరోపణలు ఎంతో కొంత వాస్తవం ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదంతా తెలియని మూర్ఖత్వం జగన్ ప్రభుత్వానిది కాదు. కానీ వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు విని ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం రాష్ట్రంలో అనవసరంగా ఒక హీరో ని తయారు చేసినట్లు అవుతుంది.
అదీ కాకుండా అతను చేసిన ఆరోపణలు తప్పు అని స్పష్టమైన ఆధారాలతో నిరూపించకుండా ఇలా అరెస్టులు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న పేరు మరియు రాచరికం చూపిస్తున్నారు అన్న అపవాదు మూటగట్టుకుంటే… మొదటికే మోసం వస్తుంది. ఇన్నాళ్లు కష్టపడి సాధించినది అంతా ఒక్క ఉదంతంతో చెరిగిపోతుంది. అతని ఆరోపణలను తప్పు అని నిరూపించి ప్రజా పాలకులుగా నిరూపించుకుంటారో లేదా అతనిని అరెస్ట్ చేసి హీరోని చేస్తారో వేచి చూడాలి