Vaccine Politics: వచ్చే నెల 1 నుండి 18 ఏళ్ళు నిండిన అందరికీ కరోనా టీకా అని కేంద్రం మొన్న ప్రకటించింది. ఓహ్.. బాగుంది అని అందరూ సంతోషించారు… ఆ తర్వాత రోజునే టీకా ధరలు ఇలా… కేంద్రానికి రూ. 150 .., రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 .. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 600 అని సీరం నుండి ఒక ప్రకటన వచ్చింది.. దీంతో ఒక గందరగోళం మొదలయింది. టీకా ఉచితమా..? అనుచితిమా..? డబ్బు పెట్టి కొనుక్కోవాలా..!? ప్రభుత్వమే మొత్తం పెడుతుందా..!? అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి..!
Vaccine Politics: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్న..!!
కరోనా టీకాల ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 నిర్ధారించారు. కేంద్రానికి మాత్రం టీకా ధర రూ. 150 నిర్ధారించారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ గానే స్పందించారు. టీకా ధరల్లో
ఈ తేడా ఎందుకు..? కేంద్రానికి, రాష్ట్రాలకు అంత ధర వ్యత్యాసం ఎందుకు..? పీఎం కేర్స్ నుండి ఆ తేడా నగదు భరించి రాష్ట్రాలకు కూడా రూ. 150 కే ఇప్పించవచ్చు కదా అని కేటీఆర్ ట్వీట్ చేసారు. ఇది మంచి పాయింటే.. పీపీఎమ్ కెర్స్ కి కరోనా ఖాతాలోనే రూ. 10 వేల కోట్లు వరకు జమైనట్టు అనధికారిక లెక్కలున్నాయి. రతన్ టాటా 1500 కోట్లు, అనిల్ అంబానీ 500 కోట్లు, అదానీ, ధమానీ లాంటి వారు బాగానే ఇచ్చారు. ఈ నిధులను వాక్సిన్ వేయించడానికి వినియోగించాలి అనేది కేటీఆర్ ప్రశ్న. నిజమే కరోనా టీకాలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అంటే ఈ స్థితిలో కష్టమే..! అలా అని వదిలేయలేరు కూడా…
ఏపీలో నిధుల లేమితో ఇబ్బందులే..!!
తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ కష్టాలున్నాయి. కానీ ఏపీ నుండి ఎవ్వరూ ఏమి ప్రశ్నించలేదు.
కేటీఆర్ ప్రశ్నకి కేంద్రం ఏం సమాధానం చెప్తుంది..? అనేది పక్కన పెడితే తెలంగాణ కంటే డబ్బుల, నిధుల విషయంలో దాహంతో, ఆకలితో అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వం నుండి కనీసం ఇటువంటి ప్రశ్న కూడా రాలేదు. కేటీఆర్ తరహాలో ప్రశ్నించే వారు కూడా ఏపీలో లేరు. ఏపీలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 18 ఏళ్ళు నిండిన సుమారు రెండున్నర కోట్ల మందికి రెండు దశల్లో టీకాలు వేయించడం ఏపీ ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. దీని కోసం కనీసం 2 వేల కోట్లు ఖర్చు చేయాలి. ఏపీ ప్రభుత్వం రూ. 400 పెట్టి టీకాలు తెప్పించాలి అంటే.. ఏపీలో ఉన్న జనాభా ప్రకారం రెండు డోసులకు కలిపి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాలి. ఏపీలో ఇప్పటికే నిధులు లేవు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నెల జీతాలు ఆలస్యమయ్యాయి. ఇటువంటి దశలో కరోనా వాక్సిన్ కోసం రూ. 2 వేల కోట్లు పెట్టాలి అంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది..!? వాక్సిన్ లు వేయించకపోతే జనంపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో జగన్ ఏం చేయనున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది..!!