దేనికైనా అమితుమీ చూసుకునే శత్రువు ఉండాలంటారు. ఆడవాళ్ళ పై, చిన్నారులు, వృద్ధులపై యుద్ధం నీతి కాదు అంటారు. బీజేపీ మాత్రం మావోయిస్టు ఉద్యమం, కేసులు, సహకారం పేరుతో వృద్దులు, దివ్యాంగులతో ఆటలాడుతోంది. వారి జీవితాలతో చెలగాటం చేస్తోంది. విరసం నేత, హక్కుల ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడిగా ముద్ర ఉన్న వరవరరావు, ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వారిపై ఉన్న కక్షను బయట పెట్టెల కనిపిస్తుంది. సాయుధ ఉద్యమాల కోపాలను వ్యక్తిగతంగా చూపడం వల్ల రాజ్యంలోని కొందరు తమ హక్కులు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల నుంచే ఉద్యమాలు పుడతాయని కొందరు గుర్తు చేస్తున్నారు.
ఎందుకీ ద్వేషం ??
వరవరరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన హక్కుల ఉద్యమకుడు. విప్లవ రచయితల సంఘంలో కీలక వ్యక్తి. మావోయిస్టు పార్టీతోనూ సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్యమ నాయకులూ వరవరరావు కు తెలిసిన వారే. ఆంధ్ర లో మావోయిస్టు పార్టీ బలంగా ఉన్న సమయంలో వరవరరావు కొన్ని అంశాల్లో ఉద్యమకారులకు సహకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సల్స్ ను చర్చలు ఆహ్వానించినపుడు నక్సల్స్ తరఫున చర్చల్లో వరవరరావు కీలకంగా వ్యవహరించారు. దాని తర్వాత ఆయన యధావిధిగా తన పనిలో నిమగ్నమైనా ఏ ప్రభుత్వం ఎప్పుడు నిర్బంధించిన దాఖలాలు లేవు. కేవలం విరసం, ఇతర ఉద్యమ సభల్లో మాత్రమే పాలు పంచుకునే వారు. ప్రస్తుతం ఆయన వయసు 81 . కొన్ని దీర్ఘకాలీక వ్యాధులు ఉన్నాయి. వేగంగా నడవలేరు. ఇలాంటి సమయంలో ఆయనను ప్రభుత్వం ఒక సభకు హాజరు అయ్యారనే నెపంతో అరెస్ట్ చేసింది. 2017 లో పుణెలోని ఎల్లార్ పరిషత్ సభలో పాల్గొన్న ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జైల్లో వేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిత్యం క్షిణిస్తూనే ఉంది. కరోనాతోను 81 ఏళ్ల వయసులో యుద్ధం చేసి గెలిచిన వరవర రావు ప్రస్తుతం వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా ఇబ్బంది పడుతుంటే ఇప్పటికి 8 సార్లు వేసిన బెయిల్ పిటిషన్స్ ను కోర్టు కొట్టేసింది. ఆయన ఆరోగ్యం మీద వైద్యులు సైతం ప్రమాదం అని రిపోర్టులు ఇచ్చిన వాటిని పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులు వేస్తున్న పిటిషన్ ల వల్ల కోర్టు బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా బెయిల్ పిటిషన్ లు నిలవడం లేదు. ఇటీవల కోర్టు ఆయన ఆరోగ్యం రీత్యా ముంబై నానావతి ఆస్పత్రికి తరలించాలని పోలీస్ లను ఆదేశించింది. అయితే బెయిల్ విషయాన్నీ తోసిపుచ్చడం విశేషం. కేంద్రం కావాలనే ఉద్యమకారులకు ఎవరైనా సహకరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో బెదిరించేందుకే వరవరరావు కి ఇలాంటి పరిస్థితి వచ్చేలా కావాలని చేస్తుంది అని ఉద్యమకారులు భావిస్తున్నారు.
సాయిబాబా ది అంతే పరిస్థితి
ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో సైతం ఇలాంటి స్థితి కొనసాగుతుంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతూ కనీసం తన పని తానూ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సాయిబాబా మీద 2014 లో
కేసు పెట్టి చిత్రవధ పెట్టారు. వెలుతురూ కూడా దురని అండ బ్యారెక్ లో వేసి ఆయనపై కక్ష తీర్చుకున్నారు. ఎన్నో ఉద్యమాలు, ఆందోనళన, సోషల్ మీడియా ప్రచారం చేసిన ఫలితం లేకపోయింది. కేవలం ఆయన ఇంట్లో దొరికిన కొన్ని పుస్తకాలు, హార్డ్ డిస్క్లు ఆధారంగా మావోయిస్టు పార్టీతో సంబంధాలు కేసు పెట్టిన ఆయనకు జైల్లో కరోనా వచ్చిన బెయిల్ ఇచ్చేందుకు
నాగపూర్ బెంచ్ నిరాకరించింది. దింతో ఆయన సైతం తీవ్ర మానసిక వ్యాధితో పాటుఇతర ఆరోగ్య సమస్యలతో క్రుంగి కృశించిపోతున్నారు.