కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడి దాదాపు 8 నెలలు కావస్తోంది. ఈ సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటిటి ప్లాట్ఫాం బాట పట్టాయి. అయితే మిగిలిన అందరికన్నా ముందే పరిస్థితిని అంచనా వేసి నడుచుకునే ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ సమయంలో కూడా షూటింగ్ లు ఆపని వర్మ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు…
అప్పుడు వర్మ..! ఇప్పుడు ఖర్మ
ఒక 20 ఏళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే ఎంతో ఆతృతగా ఎదురు చూసిన జనానికి అప్పటినుండి ఒక పదేళ్ల తర్వాత అవే సినిమాలపై విరక్తి తెప్పించిన ఘనత వర్మ ది. భారత దేశంలోనే టాప్ దర్శకులలో ఒకటిగా పేరొందిన వర్మ చాలా కాలం నుండి నాసిరకం సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. గత మూడు నాలుగేళ్లలో అయితే ఇతని పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లో కూడా క్వాలిటీ ఉండేది…. కానీ ఇప్పుడు కనీస విలువలు లేకుండా పోతున్నాయి. ఆఖరికి వర్మను విపరీతంగా అభిమానించే వారే అతనిని చాలా లైట్ తీసుకున్నారు. ఇక ఈ కరోనా సమయంలో అయితే అతని దూకుడుకి అడ్డు అనేదే లేకుండా పోయింది…
వివాదాలా…? డోంట్ కేర్
ఎవరికీ సాధ్యం కాని రీతిలో కరోనా టైం లో అరగంట, గంట నిడివితో బూతు సినిమాలు తీసి ఆన్లైన్లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసిన డబ్బులు బాగా సంపాదించాడు. ఇక ఆ సినిమాలను కూడా జనాలు నిదానంగా పట్టించుకోవడం మానేశారు. అయినా కానీ వర్మ వెనక్కి తగ్గలేదు. తన శిష్యులను పెట్టి సినిమాలు తీస్తూ తన పేరుమీద రిలీజ్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలో అతనివి మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అవే కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్ కౌంటర్. వీటిలో మర్డర్, దిధ ఎన్కౌంటర్ విషయాలపై భారీ ఎత్తున వివాదాలు వచ్చాయి, కోర్టుకి కూడా వెళ్ళాయి. కానీ ఈ సినిమాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు.
ఏలా మరి….?
ఈ క్రమంలో కరోనా వైరస్ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలోకి వదులుతాను అని వర్మ చెబుతున్నాడు. 18న మర్డర్, 25వ తేదీన దిశ ఎన్ కౌంటర్ రిలీజ్ అవుతాయి. ఇక వర్మ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కానీ పట్టించుకునేవారే కరువయ్యారు. వర్మ సినిమాలకు జనాల్లో కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు. ఇక అతని ట్విట్టర్ అకౌంట్ లో తెగ ఊదరగొడుతున్నా స్పందించే వారే లేరు. అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి సొమ్ము చేసుకుందాం అనుకుంటున్న వర్మ ప్లాన్ కు కనీసం పెట్టుబడి అయినా వస్తుందా అన్నది అనుమానమే. ఇక వర్మ ఏం మాయ చేసి జనాలు థియేటర్లకు రప్పిస్తాడో చూడాలి.