ఇక అంతా ప్రజా సమస్యలకే ప్రాధాన్యత
వైసీపీలో దాదాపు నెంబర్ టు స్థానంలో ఉండే విజయ సాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడ్డారు. క్వారైంటైన్ లో ఉన్న ఆ సమయంలో మినహా మిగిలిన అన్ని సందర్బాల్లోనూ రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ-ప్రభుత్వం మధ్య ఆయన పాత్ర కీలకంగా మారింది. ప్రతిపక్ష నేతల విమర్శలకు సమాధానంగా..వారిని టార్గెట్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సమాధానాలు ఇచ్చేవారు. మీడియా సమావేశాల కంటే ట్విట్టర్ ద్వారానే టీడీపీ..బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొనే వారు. అటువంటి విజయ సాయిరెడ్డి ఇప్పుడు తాజా నిర్ణయం తీసుకున్నారు. తాను ట్విట్టర్ ద్వారానే తన అభిప్రాయాలను వెల్లడించే సాయిరెడ్డి..ఇప్పుడు తన కొత్త ఆలోచనలను సైతం ట్విట్టర్ ద్వారానే స్పష్టం చేసారు. ఇప్పుడు ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం పైన ఆయన ట్విట్టర్ ఖాతాలో భారీ స్పందన కనిపిస్తోంది.
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే…
విజయ సాయిరెడ్డి ఒక ట్వీట్ చేసారు. అందులో తాను ఒక ప్రజా సేవకుడిగా ఇక కొత్త పాత్ర పోషిస్తాననే సంకేతాలిచ్చారు. ఇప్పటి వరకు రాజకీయ కామెంట్లకే పరిమితమైన తన ట్విట్టర్ ఖాతాతో పాటుగా మరో కొత్త ట్విట్టర్ ఖాతాను ఆరంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా తన కార్యాలయ అధికారిక ట్విట్టర్ గా ప్రకటించారు. దీని ద్వారా ప్రజా సమస్యలను..పరిష్కారం కాని అంశాలను తనకు ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా వివరిస్తే వాటి పరిష్కరానికి ర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయటానికి ముందడుగు వేస్తున్నానని స్పష్టం చేసారు. అందు కోసం ఈ కొత్త ట్విట్టర్ వేదిక కానుందని సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇందు కోసం @officeofvsr అందుబాటులో ఉంటుందన్నారు. సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసిన వెంటనే ఆయన అభిమానుల నుండి మంచి స్పందన వ్యక్తం అయింది. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ రిప్లైలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవటం..తాను ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావటం పైన పార్టీలోనూ..రాజకీయంగానూ చర్చ మొదలైంది.
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FVSReddy_MP%2Fstatus%2F1296260606769524737&widget=Tweet