కిల్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణ భారతదేశపు అడవుల్లో వీరప్పన్ చేసిన విధ్వంసం…. అన్యాయంగా బలి తీసుకున్న పోలీసులు ప్రాణాల గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరప్పన్ కుమార్తె ప్రజా జీవితంలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొనివచ్చి యూత్ లీడర్ పదవి కూడా కట్టబెట్టింది. తమిళనాడు బీజేపీ యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలు ఖరారు చేసింది.
ఇక్కడ ఎవరూ వీరప్పన్ కుమార్తెను తప్పుపట్టడం లేదు. ఆమె తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ ను పట్టించుకోకుండా బాగా చదువుకుని లాయర్ అయ్యారు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు రాజకీయ అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఆమెను తమ పార్టీలోకి తీసుకున్నారు. అంతే కొద్ది రోజుల్లోనే కీలకమైన పదవిని కూడా కట్టబెట్టేశారు. అయితే తమిళనాడులో వీరప్పన్ కు వీరాభిమానులు ఉన్నారు. వారంతా కూడా కొంచెం వైలెంట్. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే కొంతమంది రౌడీయిజం, గూండాయిజం చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.
ఇక వీరప్పన్ కు అంటూ ఒక సొంత వర్గం ఉంది. వారిలో చాలామందికి చట్టం అంటే తెలియదు న్యాయం అంటే లెక్క లేదు అని అంటుంటారు. ఇప్పుడు వీరంతా బిజెపికి ఉపయోగపడతారని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే ల మద్య చీలికలో ఏ వర్గాన్ని అయినా ఆకర్షించాలని బిజెపి ప్రయత్నిస్తుండగా ఈ సమయంలో వీరప్ప కుమార్తెకు పెద్ద పదవిని కట్టబెడితే తద్వారా ఆమె వర్గం వారిని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి బిజెపికి ఎలాంటి బేస్ లేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి ఇక అంతంత మాత్రంగా ఉన్న తమ పునాదులు కూడా పెకిలిస్తే ఏం చేయాలి? మామూలుగా అయితే బిజెపి హిందుత్వ వాదనతో ఎక్కడైనా ముందుకు వెళ్తుంది. కానీ డీఎంకే, అన్నాడీఎంకే దానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి అతని కుమార్తె మరియు ఆమె కుమార్తె ను సపోర్ట్ చేసే కొంతమంది విధ్వంసకారులను రువ్వి, హిందూయిజం పక్కనపెట్టి, వారిని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో ఎంతో కొంత బలం సంపాదించుకోవాలని బీజేపీ టార్గెట్ అని చెబుతున్నారు. వీరప్పన్ కుమార్తెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కాదు గాని ఆమెకు ఉన్న బలగాన్ని అడ్డుపెట్టుకొని తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ ప్లాన్ అట.