Covid Second Wave: కోవిడ్ సెకండ్ వేవ్ Covid Second Wave ఎప్పుడు ముగుస్తుంది? సగటు భారతీయుల్లోనే కాదు.. ప్రపంచం కూడా దీనిపైనే ఫోకస్ చేశాయి. ఫస్ట్ వేవ్ లో గట్టెక్కామనుకుంటే.. ఇటలీ, ఫ్రాన్స్ ఎదుర్కొన్న పరిస్థితులకు మించి భారత్ సెకండ్ వేవ్ తీవ్రత చూసింది. ఓదశలో కేంద్రం ప్రభుత్వం నిస్తేజంగా ఉండిపోయింది. వ్యాక్సిన్లు తయారు చేసి, పంపించి ప్రపంచ దేశాలను ఆదుకున్న భారత్ కు.. సెకండ్ వేవ్ లో అగ్రదేశాలే సాయం చేసే స్థితికి వచ్చింది. ఆక్సిజన్ కొరత, మరణాలు భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంత తీవ్రతలో సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అనే ఆలోచనల వెనుకే.. థర్డ్ వేవ్ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలోని 718 జిల్లాల్లో 533 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10శాతంపైగా ఉంది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలు వణికిపోయాయి. ఇంగ్లాండ్ లో వచ్చిన మ్యూటేషన్ ను మించి భారత్ మ్యూటేషన్ ఉండడం నిపుణులనే ఆశ్చర్యపరచింది. మొత్తంగా మే నెలలో భారత్ తీవ్ర పరిస్థితులు ఎదుర్కంటుందని.. జూన్, జూలై చివరికి పరిస్థితి అదుపులోకి వస్తుందని తేల్చారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. మే నెలలో రోజుకు 4లక్షలకు పైగా కేసులు చూసిన భారత్ ఇప్పుడు 1.50లక్షలకు దిగువకు వచ్చింది. అయితే.. కరోనా తీవ్రత.. మరణాల రేటు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం భారత్లో 21శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 5శాతం దిగువకు వస్తేనే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టనేది నిపుణుల మాట. ఇలా జరగాలంటే కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే.
Read More:Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం
ప్రస్తుతం మూడోవంతు దేశం లాక్ డౌన్ లో ఉండటం, మాస్కులు, శానిటైజర్ల వినియోగించడం వల్లే పరిస్థితి అదుపులోకి వస్తోంది. వ్యాక్సినేషన్ మించి వైరస్ ను అరికట్టే పరిస్థితి లేదు. అమెరికా, ఇంగ్లాండ్ ఇవే చేసి నిలదొక్కుకున్నాయి. జనభా ఎక్కువున్న మన దేశంలో కరోనా నిబంధనలు పాటించడం మరింత అవసరం. ప్రస్తుతం భారత్లో బి.1.617 ట్రిపుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో 8వేల మంది పిల్లలు ఈ మ్యూటెంట్ బారిన పడటం కలకలం రేపుతోంది. దీంతో నిపుణులు సెకండ్, థర్డ్ వేవ్ అంచనాలు వేయడంలో తలమునకలై ఉన్నారు. త్వరలో లాక్ డౌన్ నిబంధనలు విడతలుగా ఎత్తేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ప్రజలు గతంలా కాకుండా కరోనా నిబంధనలు పాటిస్తేనే సాధారణ పరిస్థితులు నెలకొనేది..!