YS Jagan : “పోర్టులు కావాలి.. పెట్టుబడులు పెట్టాలి.. కోట్లు కొట్టుకుపోవాలి” అనేది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటి మాట..! ఏపీలోని పోర్టుల్లో మేజర్ వాటా ఆ సామాజికవర్గానికే దక్కేలా చూసుకుని ఇన్నాళ్లుగా నడిపిస్తూ వస్తున్నారు. మధ్యలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పోర్టుల యాజమాన్యాలు మారలేదు. కానీ జగన్ ఎప్పుడైతే సీఎం అయ్యారో… ఈ పోర్టుల యాజమాన్యాలు మారిపోతున్నాయ్. కొత్త యాజమాన్యాలు కూడా జగన్ కి అనుకూలమైన తన సొంత సామాజికవర్గ పెట్టుబడి దారులకు ఇవ్వడం లేదు… బీజేపీకి నమ్మిన బంటు – బీజేపీ ఆర్ధిక వనరు అదానీ చేతికి పోతున్నాయి. అందుకే వైసీపీ – బీజేపీ చీకటి బంధం అనేది..!!
YS Jagan : మొన్న కృష్ణపట్నం – నేడు గంగవరం..!!
ఏపీలో 11 పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు మేజర్ పోర్టు. కేంద్రం చేతిలో ఉంటుంది. మిగిలినవన్నీ మైనర్ పోర్టులే.. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంటుంది. జగన్ సీఎం అయ్యాక గత ఏడాది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మారింది. నవయుగ చేతిలో ఉండే ఈ పోర్టులో 75 శాతం వాటా అదానీ చేతికి వెళ్ళింది. 50 శాతం కంటే ఎక్కువ వాటా వెళ్ళింది అంటే యాజమాన్యం వాళ్ళే. నిర్వహణ వాళ్ళే. సర్వ హక్కులు వాళ్ళకే..! సో.., కృష్ణపట్నం పోర్టుపై బీజేపీ – గుజరాత్ పెద్దాయన పాగా వేసేసారు.
* తాజాగా గంగవరం పోర్టులో కూడా వాటా అదానీ సొంతమైపోయింది. గంగవరం పోర్టులో 58 శాతం వాటా కొనుగోలు చేసినట్టు “అదానీ పోర్ట్స్” నిన్న మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోర్టు ఇప్పటి వరకు డీవీఎస్ రాజు కుటుంబం చేతిలో ఉండేది. అదానీ పోర్టు కొనుగోలుతో ఇక ఆ రాజుగారి హక్కులు డమ్మీగానే మిగిలిపోనున్నాయి. సో.. ఏపీలో రెండో కీలక పోర్టు కూడా గుజరాత్ పెద్దాయన చేతికి వెళ్ళిపోయినట్టే.
Must Read : కృష్ణపట్నం పోర్టులో ఆదానీ గ్రూపు వాటా..!?
బీజేపీ చేతిలో బొమ్మగా మారారా..!?
జగన్ సీఎం అయ్యాక ఏడాది వ్యవధిలో వైసీపీకి నాలుగు రాజ్యసభలు దక్కితే అందులో ఒకటి ముకేశ్ అంబానీ సహచరుడు.. రిలయన్స్ కంపెనీలో కీలక హోదాలో ఉన్న నత్వానికి ఇచ్చారు. సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వాల్సిన స్థానాన్ని అటు ఇచ్చేసారు. అక్కడే జగన్ బీజేపీ పెద్దల చేతిలో బొమ్మగా ఉన్నారని.. బీజేపీ సిఫార్సుతోనే ఆ రాజ్యసభ స్థానం ముకేశ్ అంబానీ అనుచరుడికి వెళ్లిపోయిందని వార్తలొచ్చాయి. తర్వాత అది మర్చిపోయారు..!
* తాజాగా పోర్టులు ఒక్కోటీ ఆదాయానికి వెళ్లిపోతున్నాయి. అదానీ అంటే నూటికి నూరు శాతం బీజేపీ మనిషి. 2014 కి ముందు అదానీ అనే కంపెనీ రెండు రాష్ట్రాలకు మాత్రమే విస్తరించి ఉండేది. కానీ 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2017 నాటికి అదానీ కంపెనీల విలువ పెరిగిపోయింది. మూడేళ్ళలోనే ఆ కంపెనీ 11 రాష్ట్రాలకు విస్తరించింది. ఆ తర్వాత ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. తాజాగా ఏపీలో కూడా అడుగు పెట్టేసింది.
* ఏపీలోని పోర్టుల్లో విశాఖపట్నం, కాకినాడ తర్వాత ఎక్కువ లావాదేవీలు జరిగేది కృష్ణపట్నం పోర్టులోనే. గ్రానైట్, ఆక్వా, పొగాకు వంటి కీలక ఉత్పత్తులు ఈ పోర్టు ద్వారానే వెళ్తుంటాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఎక్కువ. లాభాలు ఎక్కువ. ఇది ఆదాయానికి వెళ్ళిపోయింది. తాజాగా గంగవరం పోర్టులో కూడా ఆదాయానికి వెళ్ళింది. సో…, ఈ అమ్మకాల ద్వారా సీఎం జగన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు..!?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?