YS Jagan : ఓ రాష్ట్రానికి సీఎం.. కేంద్ర హోమ్ మంత్రిని, ప్రధానిని కలిసి వచ్చారు..! ఆ తర్వాత రెండు రోజులకే సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు అందించారు. ఆ ఫిర్యాదు లేఖ, ఆ ఆధారాలు మీడియాకు విడుదల చేయించారు. ఇదో సంచలనం..! ఆరు నెలలు గడిచింది. ఇప్పుడు ఆ ఫిర్యాదు పక్కకెళ్లింది. ఆ ఆధారాలు పనికిమాలినవయ్యాయి.
ఆ ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. మరి ఆ ఫిర్యాదు చేసిన సీఎం రిస్క్ లో పడినట్టా..? కాదా..!? పైగా ఆ సీఎంపై కీలక కేసులున్నాయి..! ఇదే ఇప్పుడు మనం చర్చించాల్సిన, మూలాల్లోకి వెళ్లి విశ్లేషించుకోవాల్సిన అంశం..!!
YS Jagan ; బీజేపీ ఆడిన సేఫ్ గేమ్ కాదంటారా..!? ఇది చుడండి..!!
సీఎం జగన్ X జస్టిస్ ఎన్వీ రమణ వివాదంలో “న్యూస్ ఆర్బిట్” మొదటి నుండి కొన్ని కీలక అంశాలను రాస్తుంది. ఇది కూడా ఆ కోవకే చెందుతుంది. సీఎం జగన్ రిస్క్ లో పడినట్టా..? కాదా..? అంటే కచ్చితంగా లేనట్టే. ఎందుకంటే..? జగన్ వెనుక బీజేపీ ఉంది. ఆ ఫిర్యాదు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉన్నట్టు కాస్త ఆలోచిస్తే తడుతుంది..! జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబు మనిషి అనే ఆరోపణ మొదటి నుండి ఉంది. జస్టిస్ రమణ పేరు చెప్పుకుని చంద్రబాబు చేయని రాజకీయం లేదు. సో.. రమణని కాదు అని ఆ తర్వాత వరుసలో ఉన్న నారీమన్ కి అవకాశం ఇవ్వవచ్చు. ఆయన నాలుగు నెలల తర్వాత బీజేపీ మనిషిగా ముద్ర ఉన్న ఉదయ్ ఉమేష్ లలిత్ వస్తారు.
ఆ తర్వాత అంటే ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ చేసాక వచ్చేది (అంటే ఎన్నికల సమయానికి) కాంగ్రెస్ మనిషిగా ముద్ర ఉన్న వ్యక్తి. అందుకే ఈ గేమ్ మొత్తం ఎందుకు..? జస్టిస్ రమణ తమకు అనుకూలంగా ఉంటె మొత్తం వ్యవహారం ఈజీ అవుతుంది.. వచ్చే ఎన్నికల సమయానికి ఉదయ్ ఉమేష్ లలిత్ ఉన్నత స్థానంలో ఉంటారు.. మొత్తం కథ సుఖాంతమే అని పన్నాగం వేసిన బీజేపీ తమకు అనుకూలంగా ఉండే.. స్వతహాగానే దూకుడైన సీఎం జగన్ చేత ఈ ఫిర్యాదు, ఆరోపణల లేఖని చేయించింది అనే ఒక ప్రచారం కూడా ఉంది. అంచేత బీజేపీ సీఎం జగన్ వెనుక ఉంది కాబట్టి… రమణ ఉన్నంత కాలం జగన్ కూడా ఒకరకంగా సేఫ్. కానీ అది బీజేపీతో జగన్ సేఫ్ గేమ్ ఆడినంత కాలమే… బీజేపీ వద్ద జగన్ కొంచెం తేడా కొట్టినా పై నుండి తేడా కొట్టే అవకాశాలు లేకపోలేదు.
చంద్రబాబు కొంచెం సేఫ్ లో ఉన్నట్టే..!?
సీఎం జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. శాసనాబలం ఉన్న నేత. ఆయనను కాదని బీజేపీ ఏపీలో ఏమి చేయలేదు. బీజేపీని కాదని జగన్ కూడా జాతీయస్థాయిలో ఏమి చేయలేరు. సో.. ఈ ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కూడా సేఫ్ ఉన్నట్టే. తన సన్నిహితుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి తనపై ఉన్న స్టేలు , అమరావతి ఇన్సైడర్ కేసులు, ఫైబర్ గ్రిడ్ కేసులు ముందుకు వెళ్లే అవకాశాలు లేవు. అటు జగన్ కి గానీ.. ఇటు చంద్రబాబుకి గానీ ప్రస్తుతానికి జస్టిస్ రమణ రూపంలో ఏ మాత్రం తేడా కొట్టే అవకాశాలే లేవు. బీజేపీకి రాజకీయ ఫ్రెండ్ రూపం లో జగన్.. తన సొంత మనిషి రూపంలో చంద్రబాబు ఇద్దరూ ఈ ఏడాదిన్నర సేఫ్ గా ఉన్నట్టే లెక్క. ఈ మొత్తం అంశంలో ఒక్కటి మాత్రం స్పష్టం. సీఎం జగన్ రిస్క్ చేసారు. బీజేపీ కోసం రిస్క్ చేసారు. రాజకీయంగా జగన్ బలంగా ఉన్నంత కాలం బీజేపీ కూడా ఆయనకు నీడలా ఉంటుంది. కొన్ని రాజీలు కూడా తప్పవు..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?