YS Jagan: తెలుగు సినీ రంగానికి.. ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది.. దాదాపు ఆరేడు నెలలు కొనసాగింది.. మధ్యలో విమర్శలు, ప్రతి విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు.., ప్రత్యారోపణలు ఎన్నో నడిచాయి.. మధ్య మధ్యలో కొందరు పెద్దలు వచ్చారు, కలిశారు, వెళ్లారు.. కానీ ఫలితం మాత్రం ఏమి లేదు..! కానీ ఆ వ్యవహారం మొత్తం ఒక పక్కా ప్లాన్.. ఒక అజెండా ప్రకారమే నడిచింది. వైసీపీ పార్టీ పెద్దలు.. ఆ అధినేత సీఎం జగన్ ఏం చేసినా ఒక పద్దతిగా, ఒక ప్రణాళికగా, ఒక క్రమంలో, ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేస్తారు.. కొన్ని విజయవంతమవ్వొచ్చు.., కొన్ని ఫెయిలవ్వొచ్చు.. దానిలో రాజకీయ లక్ష్యాలు కొన్ని నెరవేరొచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు.. ఇదిగో ఈ ఆన్లైన్ టికెట్ గొడవ కూడా అలాంటిదే.. వైసీపీ అనుకున్న వ్యూహమేమిటి..!? ఇప్పుడు రాజీకొస్తున్నదెవరు..!? మెట్టు దిగుతున్నదెవరు..!? దీనిలో అంతర ఉద్దేశాలేమిటి..!? అనేది లోతుగా చూస్తే..
YS Jagan: పవన్ టార్గెట్.. టీడీపీ మరో టార్గెట్..!
ఎవరు అవునన్నా.., కాదన్నా తెలుగు సినీ రంగంలో కమ్మ పెత్తనం ఎక్కువే.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటూ తెలుగు సినీ రంగంలో టీడీపీ అనుకూల, సామజిక పెత్తనం నడించింది.. ఆ తర్వాత కొన్నేళ్ల నుండి చిరంజీవి అనుకూల సామజిక పెత్తనం నడుస్తుంది.. దీనికి జనసేన బలంగా చూపే ప్రయత్నం జరుగుతుంది. అంటే.. సినీరంగం ఉంటె టీడీపీ పెత్తనం లేదా జనసేన – టీడీపీ ఉమ్మడి పెత్తనం ఉన్నట్టే లెక్క..! సో.., ఇక్కడ వైసీపీ పెత్తనం కావాలంటే ఏదోటి చేయక తప్పదు. తమ పవర్ చూపించక తప్పదు. మోహన్ బాబు, అలీ, రాజశేఖర్ లాంటి వాళ్ళ వలన అవ్వట్లేదు. అందుకే ఆన్లైన్ టికెట్ అనే ఒక పెద్ద కథని తెరమీదకు తెచ్చారు..! ఇక్కడితో అయిపోలేదు.. ఇంకో కీలకమైన అజెండా కూడా దీనిలో ఉంది..!
YS Jagan: పవన్ రాజీకొస్తారని..!
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకోనున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు ఖరారయినట్టే.. అదే జరిగితే వైసీపీకి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాన్ని ఆపాల్సిన, అడ్డుకోవాల్సిన అవసరం జగన్ బృందానికి ఏర్పడింది. అంటే పవన్ ని కంట్రోల్ చేయాలి. పవన్ ఉంటె తటస్థంగా ఉండాలి.. లేదా వైసీపీకి అనుకూలంగా ఉండాలి.. అంతే తప్ప టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు అనేది వైసీపీ లక్ష్యం..! అందుకు పవన్ ని దారిలోకి తెచ్చుకోవాలంటే తెలుగు సినీ రంగాన్ని మొత్తాన్నే కుదిపేస్తే మాట వింటారని.. దారికొస్తారని భావించారు.. కానీ పవన్ కళ్యాణ్ దారికి రాలేదు. మాట వినలేదు. వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ వైసీపీ వ్యూహంలో తప్పు లేదు, ఏదైనా రాజకీయ పార్టీ అంటే రాజకీయ లక్ష్యాలు ఉండడం సహజమే..! కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం దారికి రాలేదు.. అంచేత..
చిరంజీవిని తెరపైకి..!
ఇక్కడ చిరంజీవిని సినీ పెద్దగా కొందరు భావిస్తారు.. కొందరు కాదంటారు.. వైసీపీ కూడా మొదట భావించలేదు. అందుకే మా ఎన్నికల్లో చిరంజీవి మద్దతు పలికిన ప్రకాష్ రాజ్ కి కాదని.. మంచు విష్ణు నెగ్గేలా వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా సహకారాలు అందించింది. అంటే అక్కడ చిరంజీవి పెద్దరికం వైసీపీకి పెద్దగా అవసరం పడలేదు. కానీ.. ఈ టికెట్ వ్యవహారంలో వైసీపీ నడిపిన గేమ్ లో సరైన ఫలితం లేకపోవడం.., ఇన్నాళ్లు నడిచిన గొడవలో తిరిగి ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా మారడంతో ఇప్పుడు చిరంజీవి అవసరం వైసీపీ ప్రభుత్వానికి కనిపించింది. పవన్ కళ్యాణ్ ఎలాగూ టీడీపీ వైపు తూగుతున్నాడు. పవన్ వెంట కాపు ఓట్లు, సినీ పెద్దరికం వెళ్ళకూడదు అంటే చిరంజీవిని తెరపైకి తీసుకురావడం ఆవశ్యకం అయింది. ఇక్కడ వైసీపీకి రెండు ప్రయోజనాలు.. చిరంజీవికి తగిన గౌరవం ఇవ్వడం.. సినీ పెద్దగా జగన్ మాటిమాటికీ పిలిపించుకుని మాట్లాడడం ద్వారా కాపు వర్గాల్లో అనుకూల ఆలోచనలు రగిలించడం.., అలాగే.. సినీ రంగంలో టీడీపీ వ్యతిరేక వర్గాన్ని తయారు చేసి దానికి చిరంజీవిని నాయకుడిగా ప్రాజెక్ట్ చేయడం.. సో.. మొత్తానికి వైసీపీ మొదట వేసుకున్న ప్లాన్ కాదని.. అంతా ఉత్తుదేనని.. ఇప్పుడు చిరంజీవిని ఎంకరేజ్ చేయడం ద్వారా తను మొదలుపెట్టిన కథని.. తను అనుకున్న విధంగా కాకుండా మరో విధంగా క్లైమాక్స్ ఇస్తున్నారు సీఎం జగన్..!