గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణంరాజు ది. వైఎస్ఆర్సీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన రామరాజు గారు ఒక్క సారిగా సొంత పార్టీకి మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి తెగ హడావుడి చేసారు. అంతటి అధికారం ఉన్న వైసిపి పార్టీ గుర్తింపు హోదా కే ఎసరు పెట్టిన అతని పై అనర్హత వేటు వేయించేందుకు స్వయంగా ఏపీ ఎంపీలు ఢిల్లీ వరకు వెళ్ళేలాగా చేశాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే వారి పార్టీలోనే ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేయడం రాజుగారికే చెల్లింది. అయితే ఇంత హడావుడి చేస్తూ కూడా తను ఇప్పటికీ పార్లమెంట్ అభ్యర్థిగా తన సొంత ఇమేజ్ గెలిచాను అనిఆయన డప్పు కొట్టుకోవడం గమనార్హం.
రాజు గారా….. ఆయన ఎవరు?
ఇకపోతే జగన్ లేకపోతే నువ్వు ఎప్పటికీ గెలవాలి అన్న వాడికి సమాధానంగా…. జగన్ బొమ్మకు కొన్ని ఓట్లు పడితే తన పేరుకి కూడా కొన్ని ఓట్లు పడ్డాయని…. అందుకే స్వల్ప మెజారిటీతో గండం గట్టెక్కింది అని రాజుగారు చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా రాజుగారికి ప్రాంతంలో అంతటి పేరు ఉందా..? లేదా..? అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి జనం జగన్ ను చూసి ఓటు వేశారా లేదా రాజు గారికి సొంత ఇమేజ్ ఏదైనా ఉందా అని చూస్తే.. రాజుగారు చెప్పుకున్నట్లు అక్కడ పరిస్థితి అయితే లేదు. అసలు నరసాపురం పార్లమెంట్ లోని ప్రజలకు రఘురామకృష్ణంరాజు గారి గురించి పెద్దగా తెలియదు అని చెప్పాలి.
టీడిపి నయం కదయ్యా..!
ఇక నరసాపురం ఉప ఎన్నిక అనివార్యం అని అందరు ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఒక చిన్న అంతర్గత సర్వేను వైసీపి వారు నిర్వహిస్తే కరిద్దరు మినహాయించి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ జగన్ గాలిలోనే గెలిచారు అన్నది స్పష్టం. అక్కడి జనం జగన్ ను చూసే రాజుగారికి ఓటేశారు…. గట్టిగా చెప్పాలంటే టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వేటుకూరి శివరామరాజు అయినా నరసాపురం ప్రజలకు బాగా పరిచయస్థుడు కానీ బిజినెస్ చేసుకుంటూ ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాలలో గడిపే రాజు గారి గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి నరసాపురంలో రాజుగారికి అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులు టాక్.
సొంతగా పోటీ చేశాడనుకో….
ఇకపోతే ఒకవేళ రాజుగారికి ఉప ఎన్నికలు వస్తే తిరిగి ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా అంటే కచ్చితంగా ఆయన చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి తాజా పరిణామాలు, రాజు గారి పనులకు ప్రజల రియాక్షన్ చూస్తే అంతా జగన్ వైపే ఉన్నారు. రాజు గారిని విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ఇకపోతే అంతర్గత సర్వేల్లో తేలింది ఏమిటంటే…. దాదాపు 58 శాతం వరకు ప్రజలు మళ్ళీ వైఎస్సార్సీపీని గెలిపించాలి అని చూస్తున్నారు. ఇక ఈ రచ్చ తర్వాత ఆ సంఖ్య మరో 15% శాతం స్పష్టంగా పెరిగిందట. ఇక టిడిపి అభ్యర్థి అయిన వేటుకూరి శివరామరాజు కి 37 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండేదని.. జనసేన బిజెపిలకు ఒక 4 నుండి 5 శాతం వరకు ఓట్ల రావచ్చని అయితే రాజు గారి దెబ్బతో ఆ ఓట్లు కూడా వారికి రావని అర్థం అయిపోయింది.