YSRCP ; వైసీపీ వాడి పెంచింది. తన “పవర్” చూపించే ఎత్తులు వేస్తుంది. Nimmagadda Ramesh kumar నిమ్మగడ్డకి పూర్తిగా సెగ పెట్టేలా YSRCP ఒక ప్లాన్ రెడీ చేసి.., అమలు చేస్తుంది..! మళ్ళీ ఏ హైకోర్టు వరకో.., సుప్రీం వరకో విషయం వెళ్లినా ఏపీలో రెండు వ్యవస్థ (State Election Commission X YSRCP Government)ల మధ్య పోరు మాత్రం ఇప్పుడు అసలైన స్థాయికి చేరినట్టు చెప్పుకోవచ్చు..!!
రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా గ్రహించి ఉండరు.. దాని పరిధిలో ఉంటూనే ఇన్ని రకాలుగా పగ తీర్చుకోవచ్చు అని.., వ్యవస్థల మధ్య ఇంత స్థాయిలో యుద్ధం జరుగుతుంది అని.., ఇన్ని మలుపులు ఉంటాయని..! జగన్ X నిమ్మగడ్డ లో తాజా ట్విస్టు ఏమిటంటే.. ప్రివిలేజ్ మోషన్. వైసీపీ దీన్ని తెరపైకి తెచ్చింది. నిమ్మగడ్డపై వేసింది. సో.. ఇది చిన్న విషయం కాదు. వైసీపీ ప్లాన్ ప్రకారం, అనుకున్నది అనుకున్నట్టు అమలు చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అసెంబ్లీకి పిలిపించి తలదించుకునేలా చేయొచ్చు. కాకపోతే దీనిలో కూడా చాలా విషయాలున్నాయి. అంత ఈజీ కాదు..!
YSRCP ; వైసీపీలో ఇద్దరు సీనియర్ మంత్రులు రంగంలోకి..!!
జగన్ క్యాబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యన్నారాయణ. ఈ ఇద్దరికీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తెరవెనుక స్పీకర్, ప్రివెలజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి.., ఇతర ఎమ్మెల్యేలు దిగుతారు. నాలుగు రోజుల కిందట మంత్రులు ఇద్దరూ నిమ్మగడ్డపై కొన్ని వ్యాఖ్యలు చేసారు. వారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా విమర్శించలేరు. సో.., గవర్నర్ కి పిర్యాదు చేసారు. ఒక లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా “మా సభా హక్కులకు భంగం కలిగింది” అంటూ మంత్రులు ఇద్దరూ నిమ్మగడ్డ కి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సో.., శాసన వ్యవస్థ అంటే ఢీ కొనడం అంత సులువు కాదు.., ఈ విషయం బాగా తెలిసిన నిమ్మగడ్డ కూడా ఇప్పుడు తన పరిధిలో వేగం పెంచారు. మంత్రులు వ్యాఖ్యలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇతర కేసుల అంశాలని పరిశీలిస్తున్నారు.
Nimmagadda ; నిమ్మగడ్డని ప్రశాంతంగా ఉంచరు..!!
ఓ వైపు మంత్రులు టార్గెట్.. మరోవైపు విజయసాయి రెడ్డి.. ఇంకోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఇలా నలువైపులా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ గేమ్ ఆడుతుంది. ఎక్కడా ఆయనను ప్రశాంతంగా ఉంచకుండా పొలిటికల్ గేమ్ ఆడుతుంది. “కోర్టులో గెలిచేసాం. పంచాయతీ ఎన్నికలు పెట్టేద్దాం… అనుకున్న నిమ్మగడ్డకి ఇప్పుడు అధికార పార్టీ రకరకాల అస్త్రాలు తీసి ఇబ్బంది పెడుతుంది.
* దీనికి సిద్ధమైన నిమ్మగడ్డ కూడా “జగన్ కేసుల్లో సీబీఐ సాక్షిగా పిలిస్తే వెళ్తాను. విచారణకు సహకరిస్తాను. సాక్ష్యం చెప్తాను” అంటూ జగన్ కేసులను గుర్తు చేసి తనలోని యాంటీ జగన్ అనే కోణాన్ని బయటకు తీశారు. అసందర్భంగా, అనవసరంగా జగన్ పైనా.., వైసిపిపైనా పరోక్షంగా మాటలు విసురుతున్న నిమ్మగడ్డకి అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీసుతో తన పవర్ చూపించాలని వైసీపీ స్కెచ్ వేసింది. సో.., ఈ విషయం ఇక్కడితో ఆగదు. కోర్టుల వరకు వెళ్తుంది. చూద్దాం.., ఎవరిదీ పైచేయో.., ఎవరిది తలవంపులో..!?