నిమ్మగడ్డ సుప్రీం అఫిడవిట్ లో వైసీపీ కీలక నేతల పేర్లు…!న్యాయవ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్…!
సుప్రీం కోర్టు సూచనల మేరకు హైకోర్టు తీర్పు పై స్టే విధించాలని ఏపీ దాఖలు చేసిన పిటీషన్ లోనిమ్మగడ్డ రమేష్ రిప్లయ్ పిటిషన్ దాఖలు చేసారు. గత వారం విచారణ సమయంలో హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చిన తరువాత వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ ల గురించి నిమ్మగడ్డ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీం చీఫ్ జస్టిస్ కు వివరించారు. వీటిని వారంలోగా అఫిడవిట్ రూపంలో కోర్టుకు వివరించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మరకు నిమ్మగడ్డ దాఖలు చేసిన అఫిడవిట్ లో వైసీపీ ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావించారు. వారితో పాటుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఆగడాలను సైతం పొందరుపరిచారు. కులం పేరుతో న్యాయమూర్తులను దూషించారని పేర్కొన్నారు. దీని పైన ఆగస్టు 5న సుప్రీం కోర్టు విచారించనుంది. స్పీకర్ తో పలువురు కీలక నేతల వ్యాఖ్యలను నిమ్మగడ్డ తన అఫిడవిట్ లో వివరించారు. ఇప్పుడు ఇది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
సుప్రీంలో నిమ్మగడ్డ అఫిడవిట్..వైసీపీ ముఖ్యుల పేర్లు..న్యాయవ్యవస్థ పై వైసీపీ కార్యకర్తలు,నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పై పిటిషన్ దాఖలు గత వారం ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారంలో దాఖలు చేసిన పిటీషన్ విచారణ సమయంలో నిమ్మగడ్డ న్యాయవాదిహరీష్ సాల్వే ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కోరారు. ఈ మేరకు..నిమ్మగడ్డ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసారు. అందులో పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా పిటిషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ..వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పోస్టింగ్ లను అందులో ప్రస్తావించారు. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు తప్పు బట్టారని ..తీవ్ర వ్యాఖ్యలు చేసారని గత వారం విచారణ సమయంలో న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకు నివేదించారు. కులం పేరుతో న్యాయ మూర్తులను దూషించారని రమేష్ కుమార్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
స్పీకర్ పైనా ఫిర్యాదు…న్యాయస్థానాలను కించపరిచేల నిమ్మగడ్డ తన అఫిడవిట్ లో స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని కూడా న్యాయస్థానాలను కించపరిచే విదంగా మాట్లాడారనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు ఔన్నత్యాన్ని దిగజార్చేవిదంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రవర్తించారని పేర్కొన్నారు. న్యాయ మూర్తులను దూషించిన వారి పై కేసులు పెట్టాలని హైకోర్టు సూచించిన పోలీస్ వ్యవస్థ స్పందించడం లేదని వివరించినట్లుగా తెలుస్తోంది.
కోవిడ్ పేషెంట్స్ లతో న్యాయమూర్తులను బంధించాలని సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన నిమ్మగడ్డ దీనికి సంబంధించిన పోస్టింగ్ లను సైతం తన అఫిడవిట్ లో జత చేసినట్లుగా తెలుస్తోంది. దీని పైన సుప్రీం కోర్టు ఆగస్టు 5న విచారణ చేయనుంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో ప్రధాన చర్చకు కారణమైంది, దీని పైన కోర్టు స్పందన ఏ రకంగా ఉంటుందీ..న్యాయ పరంగా ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశం పైన చర్చ సాగుతోంది. మరి..దీని పైన వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.