YSRCP: ఆ నేత .. మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు.. ఆయన హయాంలో ఎమ్మెల్యేగా చేసారు, ఆర్టీసీ చైర్మన్ గా చేశారు.. ఆయన మరణం తర్వాత జగన్ కి సన్నిహితుడిగా మారారు.. జగన్ కి సీఎం పదవి ఇవ్వాలని పట్టుపట్టిన అనేక మంది నేతల్లో ఈయన కూడా ఒకరు.. కానీ ఏమైందో ఏమో.., ఆ నాయకుడు ఇప్పుడు జగన్ ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. జగన్ పాలనపై సంచలన కామెంట్లు చేస్తున్నారు.. జగన్ దోచుకుంటున్నారని, ఆయన బెయిల్ రద్దు అవుతుందనీ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ ఏపీ రాజకీయ కాక రగిలిస్తున్నారు. ఇంతకూ ఈయనెవరో వెలిగిందా..!? “గొనె ప్రకాశరావు” అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదుగా..
YSRCP: జగన్ ని తిడుతూ మళ్ళీ ఫేమ్ లోకి..!
2010, 2011 సమయంలో వైసీపీ ఆవిభావానికి ముందు, తర్వాత కూడా గొనె ప్రకాశరావు జగన్ కి చాలా పాజిటివ్ గా మాట్లాడేవారు. టీవీ డిబేట్లులో గంటల కొద్దీ వాదించేవారు. జగన్ ని ఎవరు ఏమన్నా.. ఊరుకునేవారు కాదు.. జగన్ ని సీఎం చేయాల్సిందే అంటూ పట్టుపట్టి, అవసరమైతే తాను గాంధీ భావం దగ్గరే ఆమరణ దీక్ష చేస్తానంటూ 2010లోనే ప్రకటించారు. ఆపై 2014 రాష్ట్ర విభజన, తెలంగాణాలో వైసీపీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. అటువంటి గొనె ప్రకాశరావు ఇటీవల మళ్ళీ టీవీల్లో కనిపిస్తున్నారు. ఈ సారి ఫుల్ టర్నింగ్ రాజకీయం చేస్తున్నారు. జగన్ ని తిడుతున్నారు. జగన్ పాలనని తూర్పారపడుతున్నారు. వైఎస్ రాజసేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉంది.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వెయిల్ రద్దు ఖాయమని, ఆయన జైలుకి వెళ్తే వైసిపి పతనం ఖాయమని భవిష్యవాణి కూడా వినిపిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు, డిబేట్లులో పాల్గొంటూ జగన్ వ్యతిరేక గళంలో చేరిపోయారు. అటువంటి వారికి ముందే మైక్ అందించే ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి వేదికల్లో బాగా కనిపిస్తున్నారు..
పులివెందులలో ప్రెస్ మీట్ పెడతారట..!
ఈరోజు తిరుమనలో స్వామి దర్శనానికి వచ్చారు. ఇక్కడ కూడా రాజకీయమే మాట్లాడారు. “తనను వైసిపి నాయకులు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.., తాను ఎవరికీ భయపడనని.. జగన్ అసలు స్వరూపం మొత్తం తనకు తెలుసు, బయటపెట్టేస్తాను, పులివెందులలోనే ప్రెస్ మీట్ పెడతాను” అంటూ వైసీపీపై ఎదురుదాడికి దిగారు.
* అంతటి విధేయుడు ఇంతలా ఎందుకు మారిపోయారు అనేది ఇప్పుడు అనుమానం. జగన్ తెలంగానలో రాజకీయం చేయడం లేదు. గొనికి ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. కానీ గొనె ఎందుకు జగన్ ని విమర్శించాలి..!? మూడు కారణాలున్నాయి. మీడియాలో హైలైట్ అవ్వడం.., తన గురించి మళ్ళీ చర్చ జరగాలి అనే ఉద్దేశం కావచ్చు.. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అని అందరికీ తెలుసు కాబట్టి.. వైసీపీ వ్యతిరేకులతో చేరే ఉద్దేశం కావచ్చు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అడుగు పెడుతున్న వేళ ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే బీజేపీ లేదా టీఆరెస్ ఇలా గొనెను రంగంలోకి దించి ఉండొచ్చు..!