ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జగపతిబాబు టాప్ రేంజ్లో ఉన్నారు. అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందట. వివరాల్లోకెళ్తే.. మహేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` చిత్రీకరణను జరుపుకుంటోంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా కాశ్మీర్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబుని యూనిట్ సంప్రదించిందట. జగపతిబాబు రెండు సినిమాలను వదులుకుని కూడా డేట్స్ను అడ్జస్ట్ చేశాడట. కానీ యూనిట్ జగపతిబాబుని పక్కన పెట్టి ఆయన స్థానంలో ప్రకాశ్రాజ్ను తీసుకుందట. జగపతిబాబుకి సరైన కారణం కూడా చెప్పలేదు. ఈ వ్యవహారంపై జగపతిబాబు మనస్థాపం చెందారట.
previous post
next post