మెగా క్యాంప్ హీరో సాయితేజ్ ఈ ఏడాది `చిత్రలహరి`తో సక్సెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` సినిమా చేస్తున్నాడు. రాశీఖన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారాన్ని ఇస్తారట మరి.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!