రెండు దశాబ్దాల నుండి హీరోయిన్గా మెప్పిస్తూ కుర్ర హీరోయిన్స్కు పోటీనిస్తున్న త్రిష.. ఇటీవల తమిళంలో విడుదలైన `పేట` చిత్రంతో తిరుగులేని సక్సెస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్తో కలిసి ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తుంది. దీంతో శరవణన్ దర్శకత్వంలో త్రిష ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కథను అందిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్కు వెళ్లనుంది.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!