మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు. ఆరోజుని దర్శకుల దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాసరి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి “నేను దాసరిగారితో ఓ సినిమా మాత్రమే చేశాను. దర్శకుడిగా కంటే వ్యక్తిగా ఆయనతో మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరికీ చుట్టరికం కూడా ఉంది. వరుసకు ఇద్దరం తాతా మనవళ్లం అవుతాం. ఆయన చివరి రోజుల్లో మా మధ్య బంధం మరింత బలపడింది. ఖైదీ నంబర్ 150 వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఆశీర్వదించారు. ఓ రోజు బొమ్మిడాయిల పులుసుతో భోజనం పెట్టారు. అలాగే అల్లు రామలింగయ్య అవార్డును ఆయన ఇంటికెళ్లి నేను ఆయనకు అందించాను. దాసరి శైలి ప్రత్యేకం. ఆయనలాంటి దర్శకుడు మళ్లీ రాడు“ అన్నారు చిరంజీవి. అలాగే దర్శకుల సంఘం నిధికి పాతిక లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కె.రాఘవేంద్రరావు తన వంతుగా 10 లక్షల రూపాయలను, తన శిష్యుడు రాజమౌళి వంతుగా రూ.50 లక్షలు, బాహుబలి నిర్మాతల తరపు రూ.15 లక్షలను విరాళాలుగా ప్రకటించారు.
previous post
next post