భారతీయ చలనచిత్ర రంగంలో పుష్ప ఒక మైలురాయి సినిమా అని చెప్పవచ్చు. ఫస్ట్ టైం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “పుష్ప” ఏమాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది డిసెంబర్ నెలలో సినిమా విడుదలైన గాని ఇప్పటికీ కూడా.. “పుష్ప” హవా సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాలో పాటలు మరియు బన్నీ పలికిన డైలాగులు.. మేనరిజం భాషలు మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.
చాలామంది సెలబ్రిటీలు.. వివిధ దేశాలకు చెందిన వాళ్లు మరియు ఇంటర్నేషనల్ క్రికెటర్ లు… రెజ్లింగ్ స్టార్ లు.. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు “పుష్ప” డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీంతో “పుష్ప 2” కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా “పుష్ప 2” షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే ఆలస్యానికి గల కారణలు గురించి అనేక వార్తలు వస్తూ ఉండగా తాజాగా కొత్త వార్త బయటకు వచ్చింది. “పుష్ప” సెకండ్ పార్ట్ ఆలస్యం అవడానికి కారణం డైరెక్టర్ బుచ్చిబాబు అని అంటున్నారు.
విషయంలోకి వెళ్తే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అని అందరికీ తెలుసు. బుచ్చిబాబు తెరకెక్కించిన మొదటి సినిమా “ఉప్పెన” సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ క్రమంలో రెండో సినిమా కోసం బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అయితే రెండో సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయడానికి రెడీ అయినట్లు ఈ క్రమంలో “పుష్ప 2” స్క్రిప్ట్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లిన సుకుమార్ ని..బుచ్చిబాబు వదలడం లేదని.. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో ఆలస్యమవుతోందని ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!