సమంత అక్కినేని, నాగశౌర్య ప్రధాన పాత్రలల్లో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ` ఓ బేబీ`. లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 5న ఈ చిత్రం విడుదలవుతుంది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత డి.సురేష్ బాబు, బాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్తో పాటు, భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కిస్తారు. `ఓ బేబీ` హిందీ వెర్షన్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!