వరుస సినిమాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని మరో సినిమా పట్టాలెక్కించాడు. టక్ జగదీష్ సినిమా షూటింగ్ త్వరలో ముగుస్తుండంతో నూతన చిత్రాన్ని నాని ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాపేరు శ్యామ్ సింగరాయ్గా గతంలోనే వెల్లడించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈరోజు సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యువ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, వెంకీ కుడుములతో పాటు నాని తండ్రి రాంబాబు గారు కూడా హాజరై పూజ కార్యక్రమాలు పూర్తి చేశారు.
నానిపై అతని తండ్రి ముహూర్తపు షాట్ కొట్టగా.. అనిల్ రావిపూడి దర్శకునిగా వ్యవహరించాడు. యువ దర్శకులు స్క్రిప్ట్ను డైరెక్టర్కు అందించారు. ఈ చిత్రానికి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈచిత్రానికి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించనున్నారు. నానిని ఈ సినిమాలో కొత్త కోణంలో చూపిస్తానని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెలిపాడు.
ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవితో పాటు కృతి శెట్టి నటిస్తున్నారు. సాయి పల్లవి గతంలో నానితో ఎంసీఏలో నటించి వెండితెరపై మాయచేశారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తుండగా కృతి శెట్టి షూటింగ్ పూర్తయిన ఉప్పెన మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రంలో ముఖ్య తారాగణంగా అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవిచంద్రన్, మురళి శర్మ పాటు పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. చిత్రం మొత్తం కోల్కత్తా నేపథ్యంలో కొనసాగానున్నట్టు తెలుస్తోంది. టాక్సీవాలా మంచి హిట్ అందుకున్న ఈ యువ డైరెక్టర్ మళ్ళీ ప్రేక్షకులను ఎంతగా ఆకర్షిస్తాడో చూడాలి. త్వరగా షూటింగ్ పూర్తిచేసి మీ ముందుకు తీసుకువస్తామని సినిమాకి అందరు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరిస్తానని డైరెక్టర్ తెలిపాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!