ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ ఏడాది తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. తెలుగులో `మన్మథుడు 2`లో నటించనుంది. అయితే రకుల్ ప్యామిలీ నుండి ఆమె తమ్ముడు అమన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తన తొలి తెలుగు సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా సెట్స్లోకి వెళ్లకముందే.. అమన్ హీరోగా మరో సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమా కూడా కొత్త బ్యానర్లోనే తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ బోను దర్శకుడు. త్వరలోనే సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని రకుల్ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ను పోస్ట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే నెటిజన్స్ మాత్రం అమన్ను ట్రోల్ చేసేస్తున్నారు. తొలి సినిమాకు ప్లాప్ డైరెక్టర్ పెట్టుకున్నట్లు ఇప్పుడు మరో డైరెక్టర్ర్ ని పెట్టుకున్నారు.. ఒకరు ఇండస్ట్రీలోకి వస్తే చాలు.. మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేస్తారు. టాలెంట్ను ఎంకరేజ్ చేయడం లేదు.. నువ్వు హీరో ఏంట్రా ఇలాంటి మెసేజ్ను పోస్ట్ చేస్తున్నారు. దీనిపై రకుల్ మాత్రం ఏమీ మాట్లాడటం లేదు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!