యువ హీరో సాయితేజ్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. మున్నిగూడలోని అక్షరాలయ అనే పాఠశాలను ఆయన దత్తత తీసుకున్నారు. `దింక్ పీస్` అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆయన రెండేళ్ల క్రితం అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నారు. 100కి పైగా పిల్లలకు ఆయన విద్య, పౌష్టికాహార అవసరాలను అందచేస్తున్నారు.ఈ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ “మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నాను. 100 పిల్లలకు నావంతు సాయపడటం ఎంతోసంతృప్తినిస్తుంది. ఈ ఏడాది మరో 50 మందిని దత్తత తీసుకున్నాను. మీకు తోచినంద ఆర్ధిక సాయం చేయండి(ఫాలోవర్స్ను ఉద్దేశిస్తూ) ఇలా చేయడం వల్ల నేను, థింక్ పీస్, ఆ చిన్నారులు మీకు రుణపడి ఉంటాం. పూర్తి వివరాలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడవచ్చు“ అంటూ పోస్ట్ చేశారు.
previous post
next post
Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!