`బాహుబలి` తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ 19వ సినిమా `సాహో`. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ గ్యాప్లో ప్రభాస్ తన 20వ సినిమా `జాన్`(ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతున్న టైటిల్) సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ షెడ్యూల్లో `జాన్` కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకూ రవీందర్ క్రియేట్ చేస్తున్న మ్యాజిక్ ఏంటో తెలుసా!. 1980 బ్యాక్డ్రాప్లో తెరకెక్కే ఈ సినిమా కోసం రోమ్ నగరాన్ని హైదరాబాద్లో క్రియేట్ చేస్తున్నాడీ ఆర్ట్ డైరెక్టర్. అందుకోసం 18 భారీ సెట్స్ నిర్మిస్తున్నాడట. ఇప్పటికి మూడు సెట్స్ వేశాడట. 4 కోట్ల రూపాయలతో హీరోయిన్ ఇంటి సెట్ను నిర్మించారట. ఈ షెడ్యూల్లో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డేలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
previous post