సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `2.0`. విజువల్ వండర్గా రూపొందిన ఈ చిత్రం `రోబో`కి సీక్వెల్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో మోస్తరు విజయాన్ని మాత్రమే దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని చైనాలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని చైనాలో 47వేల కంటే ఎక్కువ స్క్రీన్స్లో ప్రదర్శించబోతున్నారట. ఓ ఇండియన్ సినిమా చైనాలో ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే ప్రథమట. నిజానికి జూలై 12న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని `ది లయన్ కింగ్` కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని మార్గాలు క్లియర్గా ఉండటంతో సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నారు.