South Indian Movies: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సినిమాలను సౌత్ ఇండియాలో రీమేక్ చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. సౌత్ ఇండియాలో తెరకెక్కి ఎంతో విజయం సాధించిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి సినిమా రంగం పై తీవ్రమైన ప్రభావం చూపింది. దీని ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడే కోలుకోలేదని అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ఓటీటీలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి కొన్ని సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమ కొంతవరకు కోలుకుంది.
జనవరిలో క్రాక్, ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు వంటి సినిమాలు విడుదలయ్యి భారీ కలెక్షన్లను రాబట్టాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేయడం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ బడా నిర్మాతలు ఎగబడుతున్నారు. కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో మంచి విజయం అందుకున్న మరి కొన్ని సినిమాలను కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతున్నాయి. మరి వీటిలో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండటం ఎంతో విశేషం. సౌత్ ఇండియాలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతున్న ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
రీమేక్ అవుతున్న సౌత్ ఇండియా సినిమాలు:
జాతి రత్నాలు, క్రాక్, ఉప్పెన, మాస్టర్, ఆకాశం నీ హద్దురా, జులాయి, ఇస్మార్ట్ శంకర్, ఊసరవెల్లి,
అరుంధతి, అలా వైకుంఠపురంలో, జెర్సీ, దువ్వాడ జగన్నాథం, భాగమతి, హిట్ టాక్సీ వాలా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మత్తు వదలరా, ఎఫ్ 2, బ్రోచేవారెవరురా, ఖైదీ. సౌత్ ఇండియాలో మంచి విజయం సాధించిన ఈ సినిమాలు బాలీవుడ్ లో ఏ మేరకు విజయం సాధిస్తాయో వేచి చూడాల్సిందే