యువ కథానాయకుడు నిఖిల్ ప్రస్తుతం `అర్జున్ సురవరం` సినిమాను పూర్తి చేసేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఆయన భీమవరంలోని ఓ పాఠశాలను సందర్శించారు. అక్కడ 300 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరితో సమయం గడిపి ఫోటోలు దిగిన నిఖిల్ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఆ పాఠశాలలోని 300 పిల్లల చదువు ఖర్చులు బాధ్యతను తానే వహించాలనుకుంటున్నట్లు.. భవిష్యత్లో మరికొంత మంది పిల్లల అభివృద్ధికి తోడ్పాడతాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇంత గొప్ప పనిలో నాకు భాగం కలిగించిన మహేందర్, రాంబాబుకు ధన్యవాదాలు అని తెలిపారు నిఖిల్.
previous post
next post