బాలీవుడ్ బ్యూడీ ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. బాలీవుడ్ బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుని జీవనం సాగిస్తుండగా వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఐశ్వర్య కూతురు అరాధ్య అన్న విషయం కూడా అందరికే తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఐశ్వర్య ను ఓ పిచ్చోడు వార్తల్లోకి ఎక్కేలా చేశాడు. తాను ఐశ్వర్య కొడుకునంటూ 32 ఏళ్ల సంగీత్ కుమార్ అనే వ్యక్తి తెరపైకి రావడం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
దీంతో ఐశ్వర్య 15 ఏళ్లకే ఒక కుమారుడి జన్మనిచ్చిందా అంటూ చెవులు కొరుకున్నారు. తాను ఐశ్వర్యకు ఐవిఎఫ్ విధానంలో జన్మించానని సంగీత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా తాను పుట్టిన సమయం, తేదీ కూడా చెప్పుకొచ్చాడు. తాను 1967 లో జన్మించగా అప్పుడు ఐశ్వర్య వయసు 15 ఏళ్లు అని సంగీత్ పేర్కొన్నాడు. ఓ రెండేళ్ల పాటు తాను తల్లిదండ్రుల వద్దే ఉన్నాడని ఆ తరువాత తనను తండ్రి లండన్ నుండి వైజాగ్ కు తీసుకువచ్చాడని చెబుతున్నాడు.
అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమి తన వద్ద లేవనీ, తన బర్త్ డే సర్టిఫికెట్స్ అన్ని చించేశాడని సంగీత్ కుమార్ అంటున్నాడు. సంగీత్ కుమార్ లేవనెత్తిన ఈ వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని మానసిక స్థితి బాగోలేదని తేల్చి చెప్పారు. అయితే ఈ పిచ్చోడి వ్యాఖ్యలపై ఐష్ మాత్రం స్పందించలేదు. దీనిపై ఐష్ స్పందిస్తుందేమో చూడాలి మరి.