Aacharya : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకపక్క రాజమౌళితో “RRR” చేస్తూనే మరో పక్క కొరటాల “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలావరకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షెడ్యూల్ రామ్ చరణ్ పూర్తి చేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో గత కొన్ని రోజుల నుండి చరణ్ “ఆచార్య” సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూ దాదాపు 20 రోజులపాటు..ఏకధాటిగా చరణ్ తన లేటెస్ట్ షెడ్యూల్ కంప్లైంట్ చేసుకోవడం జరిగిందట.
ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉండటం తో చరణ్ .. దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ దాదాపు అరగంటకు పైగా కలిగిన కీలకపాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర కొరటాల లైన్ గా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో “ఆచార్య” కూడా అదే రీతిలో విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన “ఉప్పెన” సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడంతో… “ఆచార్య” సినిమాని భారీ రేంజ్ లో విడుదల చేయాలని .. నిర్మాత రామ్ చరణ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రస్తుతం చాలా కీలకమైన సన్నివేశాలలో నటిస్తున్నట్లు..సినిమాకి హైలెట్ అన్నట్లు.., చాలా శ్రద్ధగా కొరటాల చిత్రీకరిస్తున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. ఈ సన్నివేశాలను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.