Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఈనెల 29వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో.. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాలో దాదాపు నలభై నిమిషాలకు పైగా నటించటంతో పాటు ఫస్ట్ టైం..లాంగ్ లెంగ్త్ చిరంజీవి, చరణ్ కలిసి చేస్తుండటంతో…ఇద్దరిని స్క్రీన్ మీద చూడటానికి మెగా ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.పైగా ఇండస్ట్రీలో ఒక పరాజయం లేనిది దర్శకుడిగా ఉన్న కొరటాల ఈ సినిమా తెరకెక్కించడం తో.. ఆచార్య ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అని ఆసక్తిగా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఒక పక్క సినిమా లో హీరోగా చేసి మరో పక్క నిర్మాతగా చరణ్.. ఈ సినిమాకి రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుండి “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉండటంతో… భారీ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.ఈ ఇంటర్వ్యూ లకు చిరంజీవి -చరణ్ లతో పాటు డైరెక్టర్ కొరటాల శివ.. కుదిరితే పూజ హేగ్దే కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 వ తారీకు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ నందు నిర్వహించాలని చరణ్ ప్లాన్ చేసినట్లు టాక్. అంతమాత్రమే కాదు “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి కేటీఆర్ నీ ఆహ్వానించే ఆలోచనలో చేరనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.