Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలను పోషించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 4న విడుదలైంది. రోటీన్ స్టోరీకే కామెడి, ఎమోషన్స్ని జోడించి కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పెళ్లి కోసం పాట్లు పాడే హీరోగా శర్వా అద్భుతంగా నటించారు. రష్మిక సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఇక టాక్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగా యావరేజ్గా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.57 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1.92 కోట్లను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం- 72 లక్షలు
సీడెడ్- 18 లక్షలు
ఉత్తరాంధ్ర- 20 లక్షలు
తూర్పు గోదావరి- 9 లక్షలు
పశ్చిమ గోదావరి- 8 లక్షలు
గుంటూరు- 12 లక్షలు
కృష్ణ- 11 లక్షలు
నెల్లూరు- 7 లక్షలు
———————————————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం- 1.57 కోట్లు(2.90కోట్లు~ గ్రాస్)
———————————————————————–
కార్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.12 కోట్లు
ఓవర్సీస్- 0.23 కోట్లు
———————————————————————–
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్- 1.92కోట్లు(3.60కోట్లు~ గ్రాస్)
———————————————————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.15.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం.. రూ. 16 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. కానీ, ఇప్పుడు ఫస్ట్ డేనే కలెక్షన్స్ చాలా తక్కువ రావడంతో.. ఇలాగైతే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే శర్వా అంటున్నారు నెటిజన్లు.