Sharwanand: కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలను పోషించారు.
ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 4న విడుదలైంది. పెళ్లి కోసం పాట్లు పాడే హీరోగా శర్వా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించినా.. కథ, కథనం రోటీన్గా ఉండటం, ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్గా మారాయి.
రష్మిక నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. కానీ, శర్వా బ్యాడ్ టైమ్ కారణంగా ఆ సెంటిమెంట్ సైతం ఆయనకు హిట్ ఇవ్వలేకపోయాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. టాక్ యావరేజ్గా ఉండటం వల్ల కలెక్షన్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.57 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. రెండు రోజు రూ. 1.32 కోట్ల షేర్ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `ఆడవాళ్ళు మీకు జోహార్లు` 2 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం- 1.28 కోట్లు
సీడెడ్- 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.39 కోట్లు
ఈస్ట్ గోదావరి- 0.18 కోట్లు
వెస్ట్ గోదావరి- 0.15 కోట్లు
గుంటూరు- 0.21 కోట్లు
కృష్ణా- 0.20 కోట్లు
నెల్లూరు- 0.13 కోట్లు
———————————————————–
ఏపీ+తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్- 2.89 కోట్లు
———————————————————–
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక- 0.20 కోట్లు
ఓవర్సీస్- 0.58 కోట్లు
———————————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 3.67 కోట్లు (3.60 కోట్లు గ్రాస్)
———————————————————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.15.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం.. రూ. 16 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే మొదటి రెండు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే.. శర్వా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టమే అని అంటున్నారు సినీ ప్రియులు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!