Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలను పోషించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. కానీ, అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `భీమ్లా నాయక్` చిత్రాన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయినప్పటికీ శర్వా వెనక్కి తగ్గలేదు. చెప్పిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాడు. కానీ, అంత పెద్ద రిస్క్ తీసుకుంటే.. టాక్ బాగున్నా కలెక్షన్స్పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మనసు మార్చుకున్న శర్వా వెనక్కి తగ్గాడు. ఈ నెల 25వ తేదీన విడుదల కావాల్సిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమాను మార్చి 4వ తేదీకి షిఫ్ట్ చేశాడు.
ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితమే మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. కాగా, `మహానుభావుడు` తర్వాత హిట్టు ముఖమే చూడన శర్వానంద్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. మరి ఆయన ఆశ నెరవేరుతుందో..లేదో..చూడాలి.