Aadhi Pinisetty: టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. దర్శకుడు మరియు రచయిత అయిన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి.. హీరోగానే కాకుండా విలన్గానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ` ది వారియర్` సినిమాలో విలన్గా నటిస్తున్నాడు.
కృతి శెట్టి హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. ఒక హీరోయిన్ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ.
కోలీవుడ్కు చెందని ఈ బ్యూటీ `మలుపు` సినిమాలో ఆది పినిశెట్టి సరసన నటించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందట. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారట.
ఇక ఇప్పటి వరకు సీక్రెట్గా ప్రేమాయణం నడిపించిన ఆది, నిక్కీలు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. వారు స్పందించాల్సిందే.