ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్ లల్వాని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘పార్టనర్’. సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రాయల్ ఫార్చునా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ మనోజ్ దామోదరన్ తెరకెక్కిస్తున్నారు. ‘మరకతమణి’ వంటి డిఫరెంట్ మూవీ తర్వాత మరోసారి డిఫరెంట్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్, రెండు పాటల చితీరకరణ పూర్తయ్యాయి. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. సైంటిఫిక్ రొమెడీగా ప్రేక్షకుల ముందుకు 2020 ప్రథమార్థంలో ‘పార్ట్నర్’ సినిమా విడుదల కానుంది.