ఇప్పుడు బాలీవుడ్ చిత్ర సీమ సౌత్ ఇండస్ట్రీని నిశితంగా గమనిస్తుంది. పలు దక్షిణాది చిత్రాలను బాలీవుడ్ మేకర్స్ రీమేక్స్ చేస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మరో సౌత్ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానుందని టాక్. వివరాల్లోకెళ్తే.. తమిళంలో విజయ్సేతుపతి, మాధవన్, శ్రద్ధాశ్రీనాథ్, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం `విక్రమ్ వేద` . పుష్కర్, గాయత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారట. పుష్కర్, గాయత్రిలే హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా.. విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్.. మాధవన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే ఈ బాలీవుడ్ రీమేక్పై క్లారిటీ రానుంది.
previous post
next post