అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లెటెస్ట్ చిత్రం `ఏబీసీడీ`. డి.సురేష్బాబు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సింది. కానీ మార్చి 21న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమాను ఏప్రిల్ 12 లేదా 25న గానీ విడుదల చేయాలని యూనిట్ భావిస్తుందట. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో భరత్ హీరో స్నేహితుడిగా నటించనున్నాడు. మలయాళంలో విడుదలైన ఏబీసీడీ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటను కూడా విడుదల చేశారు. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈసారైనా అనుకున్న టైంలో విడుదలైతే బావుండు.
previous post
next post