Acharya: టాలీవుడ్ బాద్షా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఆచార్య త్వరలో రిలీజు అవుతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా బిజీగా వుంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్గా చేయాలని, ఈ ఈవెంట్ కి ఏపీ CM జగన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఆచార్య టీం అనుకున్నారట. ఇక ఈ సమాచారం బయటికి రావడంతో అది నిజామా, లేక అబద్ధమా అనే ఆలోచనే లేకుండా సోషల్ మీడియాలో చిరు మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Acharya: చిరుపై విమర్శలు ఇవే:
ఈ విషయంపై ఒకవైపు మెగా ఫ్యాన్స్ , మరోవైపు జనసైనికులు చిరు నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబట్టడం జరిగింది. ఎందుకంటే ఓవైపు ఏపీ ముఖ్యమంత్రి YS జగన్ మీద జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాడుతుంటే, ఇంకో వైపు చిరు జగన్ను తన సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనే విషయం వారు జీర్ణించుకోలేకపోయారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ ఎటాక్ మరో స్థాయికి చేరుతున్న తరుణంలో ఈ కలయికి ఎంతమాత్రం మంచిది కాదని.. పవన్కు బాగా డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇక ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టుగా తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజా వేదిక ఇదే:
అందువలన ఆచార్య ఈవెంట్ వేదికను విజయవాడ నుంచి హైదరాబాద్కు మార్చేసారట. ఈ నెల 23న హైదరాబాద్లోనే ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక ఇక్కడికి జగన్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశమే లేదు. వీలైతే కేటీర్ ని పిలిచే వీలుంది. ఎందుకంటే రామ్ చరణ్ కి కేటీర్ కి మధ్య మంచి స్నేహం వుంది. పైగా ఇందులో రామ్ చరణ్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు గనుక అతనికి ఆహ్వానం అదే అవకాశం లేకపోలేదు. ఇకపోతే ఈ విషయంపట్ల ఏపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు వేస్తుందో చూడాలి మరి.