Acharya: మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి చేసిన తాజా చిత్రం `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్గా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా విలన్లుగా నటించారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసంగా విడుదలైంది. కానీ, ఆ అంచనాలను ఈ మెగా మల్టీస్టారర్ ఏ మాత్రం అందుకోలేకపోయింది. తొలి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా డల్గానే వస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగులో రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 29.50 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 5.15 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. ఇక మూడో రోజు సండే కావడంతో మంచి వసూళ్లు వస్తాయని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ. 4.45 కోట్ల షేర్తో సరిపెట్టుకుంది. ఏరియాల వారీగా ఆచార్య 3 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం : 11.56 కోట్లు
సీడెడ్ : 5.87 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.68 కోట్లు
ఈస్ట్ : 3.18 కోట్లు
వెస్ట్ : 3.27 కోట్లు
గుంటూరు : 4.52 కోట్లు
కృష్ణ : 2.84 కోట్లు
నెల్లూరు : 2.80 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 38.72 కోట్లు(55.90 కోట్లు~గ్రాస్)
———————-
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.45 కోట్లు
ఓవర్సీస్ : 4.35 కోట్లు
———————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 45.52 కోట్లు(70.65 కోట్లు~గ్రాస్)
———————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 86.98 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ రాబట్టాల్సి ఉంటుంది.