Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. మెగా ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. రామ్ చరణ్ సైతం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
అలాగే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. తొలి షో నుంచి నెగటివ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు ఆచార్య వైపు చూసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇటు నిర్మాతలకు, అటు బయ్యర్లకు ఈ మూవీ కారణంగా భారీ నష్టాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే లాంగ్ రన్ లో ఈ మూవీ రూ. 48.36 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. ఫలితంగా రూ. 84.14 కోట్ల వరకు నష్టాలను మిగిల్చి ఆల్ టైమ్ డిజాస్టర్గా నిలిచిందీ చిత్రం. ఇక ఏరియాల వారీగా ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం : 12.45 కోట్లు
సీడెడ్ : 6.21 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.85 కోట్లు
ఈస్ట్ : 3.24 కోట్లు
వెస్ట్ : 3.40 కోట్లు
గుంటూరు : 4.59 కోట్లు
కృష్ణ : 3.09 కోట్లు
నెల్లూరు : 2.94 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 40.77 కోట్లు(59.85 కోట్లు~గ్రాస్)
———————-
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.80 కోట్లు
ఓవర్సీస్ : 4.78 కోట్లు
———————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 48.36 కోట్లు(76.00 కోట్లు~గ్రాస్)
———————–
కాగా, అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆచార్యను నెల రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ ధరకు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు.. మే 20వ తేదీ నుంచీ ఆచార్యను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!