Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. మణిశర్మ స్వరాలు అందించాడు. గత ఏడాది చివర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్గా ప్రేక్షకులను పలకరించబోతోంది.
దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన సామాజిక అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ వంటివి సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేస్తుందుకు మేకర్స్ ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లో దుమ్ము దులిపేస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం.. ఆచార్య చిత్రానికి రూ. 133 కోట్లు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అందులో నైజాం కు ఏకంగా రూ. 38 కోట్లు బిజినెస్ జరుగగా.. సీడెడ్ రూ. 20.05 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే యూఏ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 13 కోట్లు బిజినెస్ చేసిందట.
ఇక ఏపీ, తెలంగాణ కలిపి రూ. 109.2 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే మెగా హీరోల టార్గెట్ దాదాపు రూ. 135 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మెగా మల్టీస్టారర్ మూవీలో ఆచార్యగా చిరంజీవి, సిద్ధగా చరణ్లు కనిపించబోతున్నారు. అలాగే ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలను హీరోయిన్లుగా ఎంపిక చేయగా.. అనుకోని కారణాల వల్ల కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!