Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా.. సోనుసూద్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలను పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్చరణ్, నిరంజన్రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించారు.
దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన కథాంశంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. వాయిదా పడుతూ పడుతూ ఏప్రిల్ 29న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేయబోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఆచార్యకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
విషయం ఏంటంటే.. ఈ సినిమా రన్టైమ్ ఏకంగా 3 గంటలు లాక్ చేశారట. రఫ్ కటింగ్ తర్వాత వచ్చిన అవుట్ పుట్ను ఏమాత్రం ఛేంజ్ చేయకుండా లెంగ్తీ రన్ టైంతో సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. అందుకే సినిమా నిడివిని మూడు గంటలుగా ఖాయం చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా చెప్పాలనుకున్న విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకున్నప్పుడు నిడివి అనేది తప్పనిసరి. ఆ కోణంలో చూస్తే కనక ఆచార్య రన్ టైమ్ ఆమాత్రం ఉండడం సబబే అని అంటున్నారు సినీ ప్రియులు. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.