Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూర్తి స్థాయి పాత్రల్లో నటించిన చిత్రం `ఆచార్య`. ఈ మెగా మల్టీస్టారర్కు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా మెరవగా.. సోనూ సూద్, జిషు సేన్గుప్తా విలన్లుగా చేశారు.
భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాధారణ ప్రేక్షకులే కాదు అభిమానులను సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. ఎంత పెద్ద స్టార్లున్నా.. సరైన కంటెంట్ లేకపోవడంతో ఆచార్యపై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు ఊహించని స్థాయిలో నష్టాలు వాటిల్లాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ పై అలరించలేకపోయిన సినిమాలు.. ఓటీటీ వేదికగా సక్సెస్ అవుతున్నాయి. దీంతో టాక్ తేడా కొట్టిన సినిమాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య ఓటీటీ విడుదలకు ముహూర్తం పెట్టేసి అధికారికంగా అనౌన్స్ చేసేశారు. ఆచార్య డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సాలిడ్ ధరకు సొంతం చేసుకున్నారు.
మొదట ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని థియేటర్స్ లోకి వచ్చిన ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారట. కానీ, తొలి రోజే ఈ మూవీకి యావరేజ్ టాక్ రావడంతో.. నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తే కాస్త క్యాష్ చేసుకోవచ్చని అమెజాన్ ప్రైమ్ వారు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే మే 20న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.
they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7
— amazon prime video IN (@PrimeVideoIN) May 13, 2022