Acharya: మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆయన నటించిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్య సినిమాను కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు సంక్రాంతి రోజున చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది మెగా ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక దసరా పండుగకే మళ్ళీ ఆచార్య రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ, అంత గ్యాప్ ఇవ్వదలచుకోలేదు ఆచార్య బృందం. ఇలా పోస్ట్ పోన్ అంటూ ప్రకటించారో లేదో 24 గంటలు గడవక ముందే మళ్ళీ కొత్త డేట్ ప్రకటించారు.
అయితే ఈ డేట్ ఎందుకు లాక్ చేశారని ప్రకటించిన దగ్గర్నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకంటే ఆచార్య ప్రకటించిన ఏప్రిల్ 1వ తేదీకే ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అనీ ప్రకటించారు. అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం గత నెలలోనే కన్ఫర్మ్ చేసింది. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. సంక్రాంతికే రిలీజ్ అనుకున్న మేకర్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
Acharya: రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం ఖాయం.
అయితే, సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా 40 నుంచి 50 రోజుల వరకు టాకీ పార్ట్ అలాగే సాంగ్స్ పూర్తి కావాల్సి ఉందట. ఇక పోస్ట్ పోన్ వర్క్ కూడా పూర్తి కావాల్సి ఉంది. కాలికి సర్జరీ అయిన మహేశ్కు అలాగే సర్కారు వారి పాట యూనిట్లో కొందరికి కరోనా సోకింది. అందుకే షూటింగ్ జరగడం లేదట. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1కి సర్కారు వారి పాట రాదని అంటున్నారు. పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. అందుకే ఈ డేట్ను ఆచార్య టీమ్ లాక్ చేసిందట. ఒకవేళ సర్కారు వారి పాట అనుకున్న డేట్కు వచ్చినా ఆచార్యకు మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం ఖాయం.
This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @KonidelaPro @adityamusic pic.twitter.com/4Ma5wUkpd1
— Matinee Entertainment (@MatineeEnt) January 16, 2022
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!