Chiranjeevi – Mahesh: ఉప్పెన వచ్చినట్టు టాలీవుడ్ మేకర్స్ అందరికీ ఒకేసారి తమ సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటించాలనే ఊపు ఉత్సాహం వచ్చాయి. పాన్ ఇండియన్ సినిమాతో పాటు భారీ మల్టీస్టారర్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేశారు. మళ్ళీ ఈ సినిమాల తేదీలు మారతాయా లేదా తెలీదు గానీ..సరికొత్త రిలీజ్ తేదీలతో మేకర్స్ వదిలిన పోస్టర్స్ చూసి ఫ్యాన్స్ మాత్రం తెగ సంబర పడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా మరోసారి వాయిదా పడింది. ఇలా వాయిదా పడటానికి కారణం ఏంటీ అంటే మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమానే.
ఈ సినిమాను మార్చ్ 18న లేదంటే ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందు ప్రకటించారు. దానికంటే ముందే ఆచార్య సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దాంతో ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గ్యారెంటీగా మళ్ళీ కొత్త విడుదల తేదీని చూసుకుంటుందని అందరూ భావించారు. అలా భావించినట్టుగానే మహేశ్ మరోసారి సోలో తేదీ చూసుకున్నాడు. పైగా ఇది చాలా వరకు సేఫ్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే మహేశ్ బాబు ఎంచుకున్న రిలీజ్ తేదీ మే నెలలో కాబట్టి.
Chiranjeevi – Mahesh: ఆచార్య సినిమా ఏప్రిల్ 1వ తేదీన వస్తే కలెక్షన్స్ పరంగా ఇబ్బందులే.
సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1వ తేదీన కాకుండా మే 12న రిలీజ్ చేస్తామని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మహేశ్ ఈ డేట్ ఫిక్స్ చేసుకోవడం వెనక రెండు కారణాలు వాటిలో ఒకటి ఆయన ఇంకా సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండటం..మరొకటి భారీ సినిమాల మధ్య పోటీ పడి వచ్చేకంటే కాస్త ఆలస్యం అయినా కరోనా ఎఫెక్ట్తో పాటు మిగతా సినిమాల తాకిడీ లేకుండా వద్దామనుకోవడం. ఇక ఆచార్య సినిమా ఏప్రిల్ 1వ తేదీన వస్తే కలెక్షన్స్ పరంగా ఇబ్బందులే. ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ మార్చ్ 25 న వస్తుండటమే. ఎంత లేదన్నా ఈ సినిమా ప్రభావం మిగతా సినిమాల మీద ఓ రెండు వారాలైనా ఉంటుంది. దాంతో ఆచార్య బాగానే గ్యాప్ తీసుకొని ఏప్రిల్ చివరిలో 29 వ తేదీన వస్తున్నారు. మొత్తానికి ప్లానింగ్ అయితే బాగానే ఉంది. ఏ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!