Dhruv Sarja : టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న హీరో అర్జున్ అందరికీ సుపరిచితమే. తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నటించిన అర్జున్ ఎంత మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. సీనియర్ హీరోయిన్ అర్జున్ తన మేనల్లుడు ధృవ సర్జా హీరోగా ‘సెమ తిమిరు’ అనే చిత్రంలో నటించారు. ఇదే సినిమా తెలుగులో “పొగరు” అనే టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.సాయి జగద్గురు మూవీస్ బ్యానర్పై నిర్మాతలు బీకే గంగాధర్, శివ అర్జున్లు కలిసి ఈ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను సాయిసూర్య ఎంటర్టైన్మెంట్ అధినేత డి.ప్రతాప్ రాజు సొంతం చేసుకుని విడుదల చేస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధ్రువ సరసన హీరోయిన్ పాత్రలో రష్మిక మందన నటించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇటీవల చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్, ఆడియో విడుదల ఫంక్షన్ లో సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ మాట్లాడుతూ….”ధృవ సర్జా వరసకు నాకు మేనల్లుడు. కానీ, అతను నాకు కొడుకుతో సమానం అని తెలిపారు. ధృవ అన్న చిరంజీవి సర్జా. ఈయనకు కూడా నటనపై ఎనలేని అభిమానం. అందుకు నటనలో ఎన్నో ప్రత్యేక శిక్షణలు తీసుకున్నాడు.కానీ దురదృష్టం చిరంజీవిని వెంటాడి ప్రస్తుతం మన మధ్య లేకుండా అందనంత దూరానికి తీసుకెళ్లాడని అర్జున్ తెలిపారు. అదే విధంగా చిరంజీవి నటించిన మూడు సినిమాలలో ధృవ కూడా నటించాడని ఆ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని అర్జున్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ పాత్ర కోసం 40 కిలోలు తగ్గిన హీరో…
‘సెమ తిమిరు’ సినిమా కోసం హీరో ధృవ దాదాపు నలభై కిలోల బరువు తగ్గారని ఈ సందర్భంగా అర్జున్ తెలియజేశాడు. ఈ సినిమాలో ఎంతో కష్టపడి నటించిన ధృవకు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని అర్జున్ తెలిపారు. అదే విధంగా ఈ సినిమాతో పాటు తన శిష్యుడు విశాల్ నటించిన”చక్ర” సినిమా కూడా విడుదల అవుతుందని, ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని అర్జున్ ఆకాంక్షించాడు.. ఈ సందర్భంగా హీరో ధృవ మాట్లాడుతూ.. వృత్తిపరంగా, లేదా వ్యక్తిగత విషయం లోనైనా తన వేసే ప్రతి అడుగు తన మామ అర్జున్ అడుగుజాడల్లో ఉంటుందని ఈ సందర్భంగా ధృవ సార్జా తెలియజేశారు.