Kamal Haasan: ప్రస్తుతం ఓటిటి ల హవా నడుస్తోంది. ఒకప్పుడు ఓటిటి అంటే చాలా చీప్ గా చూసే పరిస్థితి ఉండేది. కరోనా రాకముందు కేవలం చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ మాత్రమే విడుదల అయ్యేవి. కానీ కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం తారు మారయ్యాయి. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు థియేటర్ లలో బిజినెస్ పడిపోవడంతో ఓటిటి హవా స్టార్ట్ అయింది. దీంతో ఇప్పుడు పెద్ద హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అందరూ ఓటిటి బాటపడుతున్నారు. కేవలం సినిమాలో మాత్రమే కాదు రకరకాల కార్యక్రమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
థియేటర్ లో సినిమా బాగుంటే ఒక 50 రోజులు ఆడిన తర్వాత మాత్రం రెండు నెలల లోపు ఓటిటిలో సినిమా వచ్చేస్తుంది. ఇక సినిమా పోయింది అంటే రెండు వారాలకే ఓటిటిలో ప్రసారమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఓటిటి ధరలు కూడా నిర్ణయించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓటిటి లపై సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓటిటి వ్యవస్థ భవిష్యత్తులో వస్తుందని గతంలోనే తాను చెప్పినట్లు.. కమల్ తాజాగా స్పష్టం చేశారు. దీనికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
అయితే అప్పట్లో తన మాటలను ఎవరు పెద్దగా లెక్క చేయలేదని .. పట్టించుకోలేదని అన్నారు. తాజాగా ఐఫా అవార్డుల కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అన్ని భాషలలో ఓటిటి వేదికగా ప్రేక్షకులు ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నారు. తాను చిన్న సినిమాలకు వీరాభిమానిని.. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్లు కమల్ తెలిపారు. ఈ ఐఫా వేడుకలలో కమల్ హాసన్ కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చినట్లు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!